iDreamPost
android-app
ios-app

2025 సమ్మర్ పై పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కర్చీఫ్! ఏప్రిల్ అంతా వాళ్లదే!

  • Published Jul 30, 2024 | 3:53 PM Updated Updated Jul 30, 2024 | 3:53 PM

People Media Factory: మూవీ లవర్స్ అంతా ఎప్పుడెప్పుడు ఏ సినిమాలు రిలీజ్ అవుతాయా అని ఎదురుచూస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు రిలీజ్ కు సిద్ధంగా ఉన్న భారీ బడ్జెట్ సినిమాలు చాలానే ఉన్నాయి. ఈ క్రమంలో 2025 ఏప్రిల్ లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి రెండు భారీ బడ్జెట్ చిత్రాలు రిలీజ్ కు రెడీ గా ఉన్నాయి.

People Media Factory: మూవీ లవర్స్ అంతా ఎప్పుడెప్పుడు ఏ సినిమాలు రిలీజ్ అవుతాయా అని ఎదురుచూస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు రిలీజ్ కు సిద్ధంగా ఉన్న భారీ బడ్జెట్ సినిమాలు చాలానే ఉన్నాయి. ఈ క్రమంలో 2025 ఏప్రిల్ లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి రెండు భారీ బడ్జెట్ చిత్రాలు రిలీజ్ కు రెడీ గా ఉన్నాయి.

  • Published Jul 30, 2024 | 3:53 PMUpdated Jul 30, 2024 | 3:53 PM
2025 సమ్మర్ పై పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కర్చీఫ్! ఏప్రిల్ అంతా వాళ్లదే!

ప్రస్తుతం ఇండస్ట్రీ లో రిలీజ్ కు సిద్ధంగా ఉన్న భారీ బడ్జెట్ సినిమాలు చాలానే ఉన్నాయి. ఈ ఏడాదే కాకుండా వచ్చే ఏడాది రిలీజ్ కాబోతున్న సినిమాలకు కూడా ఇప్పటినుంచే హైప్ మొదలైంది. ఈ క్రమంలో 2025 ఏప్రిల్ లో పీపుల్ మీడియా ప్రొడక్షన్ నుంచి రెండు పెద్ద సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు వస్తున్న సినిమాలన్నీ కూడా.. ఈ ప్రొడక్షన్ కంపెనీ తరపున వస్తున్న చిత్రాలే. ప్రస్తుతం ఇండస్ట్రీ లో ఈ సంస్థకు ప్రత్యేకమైన ఆదరణ లభిస్తుంది. ఈ క్రమంలో 2017 నుంచి ప్రేక్షకులకు మంచి సినిమాటిక్ అనుభవాలను అందించే దిశగా.. అడుగులు వేస్తుంది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. మరి 2025 ఏప్రిల్ లో ఈ సంస్థ తరపున రాబోయే చిత్రాలేంటో.. అవి ఎలాంటి హైప్ ను క్రియేట్ చేస్తున్నాయో చూసేద్దాం.

రాజా సాబ్:

People Media Factory

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తరపున రాబోతున్న ఫ్యాన్ ఇండియా మూవీ రాజా సాబ్. చాలా రోజుల తర్వాత ప్రభాస్ లవర్ బాయ్ లా కనిపిస్తున్న సినిమా ఇది. ఈ సినిమాకు మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. మొదట ఈ కాంబినేషన్ అనౌన్స్ చేసినప్పుడు ప్రేక్షకులు కాస్త కంగారు పడినా .. ఆ తర్వాత ఈ సినిమా నుంచి రిలీజ్ అయినా పోస్టర్స్ చూశాక మూవీపై పాజిటివ్ ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. ఇక రీసెంట్ గా రిలీజ్ చేసిన ఫస్ట్ ఫ్యాన్ ఇండియా గ్లింప్స్‌ చూసిన తర్వాత అయితే.. అసలు ఏ డౌట్ లేకుండా మళ్ళీ వింటేజ్ ప్రభాస్ తిరిగి వచ్చి.. బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టేస్తాడని ఫిక్స్ అయిపోయారు అభిమానులు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది. 2025 ఏప్రిల్ 10న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. రానున్న రోజుల్లో ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్ డేట్స్.. ఇంకా ఎలాంటి హైప్ క్రియేట్ చేస్తాయో వేచి చూడాలి.

మిరాయ్ :

People Media Factory 01

ఈ ఏడాది మొదట్లో చిన్న సినిమాగా థియేటర్స్ లో అడుగుపెట్టి.. సెన్సేషన్ క్రియేట్ క్రియేట్ చేసిన మూవీ.. ‘హనుమాన్’. ఈ సినిమాతో తేజ సజ్జా క్రేజ్ ఓ రేంజ్ లో పెరిగిపోయింది. ఇక ఇప్పుడు ఈ హీరో నుంచి రాబోతున్న మరొక మూవీ మిరాయ్. ఈ సినిమా కూడా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తరపున రాబోతుంది. ఈ సినిమాకు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నాడు. అలాగే ఈ సినిమాలో మనోజ్ విలన్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన టీజర్.. అందరిని ఆశ్చర్య పరిచింది. . అశోకుడి రహస్య గ్రంథాల నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రంలో.. అసలు ఏం చూపించబోతున్నారా అనే సస్పెన్స్ అందరిలో నెలకొల్పారు మేకర్స్. ఈ సినిమాను 2025 ఏప్రిల్ 18న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇప్పటికైతే ఈ సినిమా నుంచి రీసెంట్ అప్ డేట్స్ ఏమి లేవు కానీ.. రానున్న రోజుల్లో అదిరిపోయే అప్ డేట్స్ ను రివీల్ చేయడానికి రెడీ గా ఉన్నారు మేకర్స్.

మరి ఈ రెండు సినిమాలు ఎలాంటి రిజల్ట్ ను తెచ్చి పెడతాయో వేచి చూడాలి. ఒకవేళ ఇప్పుడు కొనసాగుతున్న హైప్ రిలీజ్ తర్వాత కూడా ఉంటే మాత్రం కచ్చితంగా 2025 ఏప్రిల్.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మంత్ అని చెప్పి తీరాల్సిందే. మరి ఈ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.