iDreamPost
android-app
ios-app

నాగ్ చైతన్య, శోభిత పెళ్లి అక్కడే.. మార్చిలో ఏడడుగులు

  • Published Aug 22, 2024 | 11:08 AM Updated Updated Aug 22, 2024 | 11:21 AM

Naga Chaitanya Sobhita Dhulipala Marriage Date, Place: అక్కినేని నాగ చైతన్య, హీరోయిన్ శోభిత ధూళిపాళ అతి త్వరలోనే వివాహ బంధంతో ఒకటి కాబోతున్నారు. తాజాగా వీరిద్దరి పెళ్లి ఎప్పుడు, ఎక్కడ జరగనుందనే వార్త నెట్టింట వైరల్ గా మారింది.

Naga Chaitanya Sobhita Dhulipala Marriage Date, Place: అక్కినేని నాగ చైతన్య, హీరోయిన్ శోభిత ధూళిపాళ అతి త్వరలోనే వివాహ బంధంతో ఒకటి కాబోతున్నారు. తాజాగా వీరిద్దరి పెళ్లి ఎప్పుడు, ఎక్కడ జరగనుందనే వార్త నెట్టింట వైరల్ గా మారింది.

  • Published Aug 22, 2024 | 11:08 AMUpdated Aug 22, 2024 | 11:21 AM
నాగ్ చైతన్య, శోభిత పెళ్లి అక్కడే.. మార్చిలో ఏడడుగులు

టాలీవుడ్ యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, హీరోయిన్ శోభిత ధూళిపాళకు ఇటీవలే నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కాగా,ఆ వేడుగలనేవి ఈనెల ఆగస్టు 8వ తేదీన ఇరు కుటుంబ సభ్యులు సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగాయి. పైగా ఈ నిశ్చితార్ధ వేడుకలకు సంబంధించి ఫోటోలను కింగ్ నాగర్జున స్వయంగా తన ఎక్స్ వేదికగా పంచుకున్నారు. ఇక అప్పటి నుంచి చైతు, శోభితల ఫోటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా.. ఎప్పుడు వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు ఎక్కడ చేసుకోబోతున్నారు అనే విషయాలపై నెట్టింట చర్చలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే వీరిద్దరూ ఫారిస్ లో వివాహం చేసుకోబోతున్నారు అనే రూమర్స్ కూడా వినిపించ సాగాయి. కానీ, తాజాగా చైతన్య,శోభితల పెళ్లి డేట్ పై మరో తాజా సమాచారం నెట్టింట వైరల్ గా మారింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

శోభిత్, నాగ్ చైతన్య అతి త్వరలోనే వివాహ బంధంతో ఒకటి కాబోతున్నారు. అయితే వీరి వివాహం ఈ ఏడాది చివర్లో కానీ, వచ్చే ఏడాది 2025 మార్చిలో కానీ గ్రాండ్ గా రాజస్థాన్ లో అంగరంగ వైభవంగా జరగనుందని సమాచాం జోరుగా వినిపిస్తుంది. అయితే ఈ విషయం పై ఇటు అక్కినేని కుటుంబం నుంచి కానీ, శోభిత ధూళిపాళ దగ్గర నుంచి ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు. అయితే ఏదీ ఏమైనా వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలలో మాత్రం కచ్చితంగా ముహూర్తం ఫిక్స్ చేయనున్నారని సమాచారం. కాకపోతే నాగ చైతన్య, శోభిత సినిమా కాల్షీట్స్ వీరి కుటుంబంలోని అందరికీ అందుబాటులో ఉండే సమయం బట్టి పెళ్లి తేదీ పై ఫిక్స్ చేయనున్నారని సమాచారం. మరీ, అదే కనుక నిజమైతే మరో ఆరు నెలలో ఈ లవ్ బర్డ్స్ వివాహ బంధంతో ఒకటి కాబోతున్నారు.

ఇదిలా ఉంటే..ప్రస్తుతం నాగ చైతన్య తాండేల్ సినిమాతో బిజీగా ఉన్నారు. కాగా, ఈ సినిమాను చందు మోండేటి తెరకెక్కించానున్నారు. ఇక ఇందులో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది.ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.ఇకపోతే ఈసినిమా రిలీజ్ డేట్ దసరా తర్వాత క్లారిటీ వస్తుంది. ఒక షిప్ కి సంబందించి VFX వర్క్ ఉంది. అది కంప్లీట్ అయ్యాక డిసిషన్ తీసుకుంటామని ఇటీవలే బన్నీ వాసు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరీ, త్వరలోనే నాగ చైతన్య, శోభిత ధూళిపాళ వివాహం రాజస్థాన్ లో జరగనుందనే సమాచారం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.