iDreamPost
android-app
ios-app

Mathu Vadalara2: రిలీజ్ కు రెడీ అయిన ‘మత్తు వదలరా 2’! ఈసారి అంతకు మించిన కామెడీ..

  • Published Aug 15, 2024 | 4:56 PM Updated Updated Aug 15, 2024 | 4:56 PM

Mathu Vadalara2 Movie Release On Diwali: 2019లో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన మత్తు వదలరా మూవీకి సీక్వెల్ రాబోతోంది. దీపావళి కానుకగా పార్ట్ 2ను థియేటర్లలోకి తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్లాన్ వేస్తున్నారు. పార్ట్ 1కు మించిన కామెడీ ఈ సినిమాలో ఉంటుందని తెలుస్తోంది.

Mathu Vadalara2 Movie Release On Diwali: 2019లో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన మత్తు వదలరా మూవీకి సీక్వెల్ రాబోతోంది. దీపావళి కానుకగా పార్ట్ 2ను థియేటర్లలోకి తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్లాన్ వేస్తున్నారు. పార్ట్ 1కు మించిన కామెడీ ఈ సినిమాలో ఉంటుందని తెలుస్తోంది.

Mathu Vadalara2: రిలీజ్ కు రెడీ అయిన ‘మత్తు వదలరా 2’! ఈసారి అంతకు మించిన కామెడీ..

ప్రస్తుతం టాలీవుడ్ లో సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. పార్ట్ 1 సూపర్ హిట్ కాగానే.. దానికి సీక్వెల్ ను తెరకెక్కిస్తున్నారు మేకర్స్. అయితే కొందరు మాత్రం పార్ట్ ను ఎప్పుడు స్టార్ట్ చేశారు? అసలు ఎప్పుడు ప్రకటించారు? సడెన్ గా రిలీజ్ డేట్ ఎలా ప్రకటించారు? అన్న సందేహాలు సగటు సినీ ఫ్యాన్స్ లో ఉంటాయి. ఇక కొన్ని సినిమాల రిలీజ్ డేట్ ప్రకటించగానే.. అరె, ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభించారు? అప్పుడే విడుదల తేదీని ప్రకటించారు? అంటూ ఫ్యాన్స్ షాక్ కు గురౌతూ ఉంటారు. ప్రస్తుతం ఓ సినిమా విషయంలో టాలీవుడ్ ప్రేక్షకుల రియాక్షన్ ఇలాగే ఉంది. ఓ క్లాసిక్ కామెడీ మూవీ సీక్వెల్ రిలీజ్ కు రెడీ అయ్యింది.

ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ MM కీరవాణి కొడుకు సింహా కోడూరి హీరోగా నరేష్ అగస్త్య, సత్య, అతుల్య చంద్ర కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘మత్తు వదలరా’. రితేశ్ రానా దర్శకత్వంలో 2019లో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ చిత్రానికి సీక్వెల్ రాబోతోందని మేకర్స్ అప్పట్లోనే ప్రకటించారు. కానీ చాలా కాలం ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి న్యూస్ బయటకి రాలేదు. కానీ సడెన్ గా ‘మత్తు వదలరా 2’ ను దీపావళి కానుకగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నారట. పార్ట్ 2 షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చినట్లు తెలుస్తోంది.

mathu vadalara 2 coming

కాగా.. ఈ న్యూస్ కాస్త వైరల్ కావడంతో.. అసలు ఈ సీక్వెల్ షూటింగ్ ను ఎప్పుడు స్టార్ట్ చేశారు? అని ఆడియెన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పార్ట్ 1లో సత్య కామెడీ నవ్వులు పూయించిన విషయం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇక ఇప్పుడు సీక్వెల్ లో అంతకు మించిన కామెడీ ఉంటుందట. టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్సే ఈ సీక్వెల్ ను తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి కీరవాణి మరో కొడుకు కాల భైరవ మ్యూజిక్ అందిస్తున్నాడు. మరి ఈ చిత్రం ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందో చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by Skyupsmedia (@skyupsmedia)