వారు చేసిన కుట్రే.. జానీ నాతో ఇదే చెప్పాడు – భార్య అయేషా

Jani Wife Ayesha: కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు గత మూడు రోజులుగా పోలీసులు కస్టడీలో విచారణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే జానీ భార్య అయేషా తన భర్తను కలిసేందుకు పోలీసులు ఫర్మిషన్ ఇవ్వడంతో.. ఆమె ఇంటి నుంచి జానీ మాస్టర్ కు భోజనం తీసుకువచ్చారు. ఈ క్రమంలోనే ఓ మీడియా ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన అయేషా జైల్లో తన భర్త ఇదే నాతో చెప్పాడంటూ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.

Jani Wife Ayesha: కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు గత మూడు రోజులుగా పోలీసులు కస్టడీలో విచారణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే జానీ భార్య అయేషా తన భర్తను కలిసేందుకు పోలీసులు ఫర్మిషన్ ఇవ్వడంతో.. ఆమె ఇంటి నుంచి జానీ మాస్టర్ కు భోజనం తీసుకువచ్చారు. ఈ క్రమంలోనే ఓ మీడియా ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన అయేషా జైల్లో తన భర్త ఇదే నాతో చెప్పాడంటూ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ప్రస్తుతం అత్యాచారం కేసులో అరెస్ట్ అయ్యి జైలు జీవితం గడుపుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో గత మూడు రోజులుగా జానీ మాస్టర్ కు పోలీసులు కస్టడీలో విచారణ కొనసాగుతుంది. కాగా, బాధితురాలు స్టేట్‌మెంట్‌ను ముందు ఉంచి జానీని నార్సింగి పోలీసులు విచారణ కొనసాగించారు. ఇక పోలీసుల విచారణలో బాధితురాలే తనను వేధించిందని జానీ మాస్టర్ పలు సంచలన విషయాలు బయట పెట్టిన విషయం తెలిసిందే. మరోవైపు జానీ భార్య అయేషా తన భర్తను కలిసేందుకు పోలీసులు ఫర్మిషన్ ఇవ్వడంతో.. ఆమె ఇంటి నుంచి జానీ మాస్టర్ కు భోజనం తీసుకువచ్చారు. ఈ క్రమంలోనే ఓ మీడియా ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన అయేషా జైల్లో తన భర్త ఇదే నాతో చెప్పాడంటూ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాళ్లోకి వెళ్తే..

జానీ మాస్టర్ కేసులో మూడవ రోజు విచారణ భాగంగా అతని భార్య అయేషా ఆయనను కలిసేందుకు స్టేషన్ కు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమె తన భర్త కోసం ఇంటి నుంచి భోజనం కూడా తీసుకెళ్లారు. అనంతరం పోలీసు స్టేషన్ బయట ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా అయేషాకు జైల్లో తన భర్త జానీ ఏ విషయం కోసం మాట్లాడారు, అసలు ఎలా ఉన్నారు అంటూ ప్రశ్నలు ఎదురయ్యాయి. ఇక ఆ ప్రశ్నలకు స్పందించిన అయేషా మాట్లాడుతూ.. ‘జానీ మాస్టర్ ఫ్యామిలీ విషయాలను మాత్రమే మాట్లాడారు.  ముఖ్యంగా పిల్లలను చాలా మిస్ అవుతున్నాను అని చెప్పుకొచ్చారు’. ఇక జానీ మాస్టర్ ఈ తప్పు చేశారని ఒప్పుకున్నారనే ప్రశ్న తలెత్తడంతో.. ‘ఆయన ఈ తప్పు చేయలేదని, తప్పు చేయకుండా ఎందుకు ఒప్పుకుంటారు, కావలనే తనపై ఇదంతా కుట్ర చేస్తున్నరనైతే చెప్పారంటూ’ ఆమె పేర్కొన్నారు.

అలాగే తన భర్త నిజం ఒప్పుకున్నారంటూ మీడియా కావలనే రాస్తున్నారని, అదంతా అవాస్తవమని ఆయేషా అన్నారు. ఇకపోతే కావలనే ఆ అమ్మాయి ఈ ఆరోపణలు చేసిందని పేర్కొన్నారు. ఆమె ఏమి ఆశిస్తుందో తెలియదని అన్నారు. తన భర్తపై చేసిన ఆరోపణలను న్యాయస్థానంలోనే తేల్చుకుంటామని తెలిపారు. ఎన్నో సంవత్సరాలుగా శిష్యురాలిగా ఉన్న అమ్మాయి లైంగిక ఆరోపణలు చేస్తే ఎవరైనా నమ్ముతారా అని ఆయేషా ప్రశ్నించింది. తనకు మాస్టర్ లైఫ్ ఇచ్చారని చెప్పిన అమ్మాయి .. ఇప్పుడు వేధించాడని చెప్పడం ఆశ్చర్యంగా ఉందని అన్నారు.  కేవలం చెప్పుడు మాటలు విని ఆ అమ్మాయి ఇలా చేసి ఉండవచ్చని ఆయేషా అనుమానం వ్యక్తం చేశారు.

దీని వెనుక ఎవరో ఉండి ఇదంతా నడిపిస్తున్నరనే అయితే అనుమానం ఉంది. ఎందుకంటే అందరికీ మనం నచ్చలని లేదు, నచ్చని వారు ఈ విధంగా పేరు ప్రతిష్ఠలను దెబ్బకొట్టాలని ప్రయత్నిస్తారు, త్వరలోనే నిజ నిజాలు బయటపడతాయి, మేము న్యాయంగా కోర్టులో తెల్చుకుంటాం. ఇండస్ట్రీలో కూడా నెమ్మదిగా మాకు అందరూ మద్దతూగా వస్తారంటూఆమె పేర్కొన్నారు. ఇకపోతే జానీ మాస్టర్ విచారణ కస్టడీ నేటితో ముగియనుంది. అనంతరం ఈరోజు ఉదయం జానీ మాస్టర్ ను పోలీసులుకోర్టులో ప్రవేశపెట్టనున్నారు. మరి, జానీ మాస్టర్ భార్య చెప్పిన సంచలన నిజాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments