iDreamPost
android-app
ios-app

నీ భార్యను వదిలెయ్.. అని జానీని బ్లాక్ మెయిల్ చేసింది: ఆయేషా

  • Published Sep 21, 2024 | 4:09 PM Updated Updated Sep 21, 2024 | 4:25 PM

Jani Wife, Ayesha: ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ రెస్ట్ అయిన దగ్గర నుంచి ఆయన భార్య ఆయేషా అలియాస్ సుమలత పేరు సోషల్ మీడియాలో తెగ మారు మోగిపోతున్న విషయం తెలిసిందే.. దీంతో ఎక్కడ చూసినా ఆయేషాకు సంబంధించిన ఇంటర్వ్యూలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయేషా.. నా భర్త నన్ను వదిలేయేలాని ఆ అమ్మాయ్ బెదిరించిందంటూ పలు షాకింగ్ కామెంట్స్ చేసింది.

Jani Wife, Ayesha: ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ రెస్ట్ అయిన దగ్గర నుంచి ఆయన భార్య ఆయేషా అలియాస్ సుమలత పేరు సోషల్ మీడియాలో తెగ మారు మోగిపోతున్న విషయం తెలిసిందే.. దీంతో ఎక్కడ చూసినా ఆయేషాకు సంబంధించిన ఇంటర్వ్యూలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయేషా.. నా భర్త నన్ను వదిలేయేలాని ఆ అమ్మాయ్ బెదిరించిందంటూ పలు షాకింగ్ కామెంట్స్ చేసింది.

  • Published Sep 21, 2024 | 4:09 PMUpdated Sep 21, 2024 | 4:25 PM
నీ భార్యను వదిలెయ్.. అని జానీని బ్లాక్ మెయిల్ చేసింది: ఆయేషా

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసు ప్రస్తతం ఇండస్ట్రీ వర్గాల్లోనే కాదు.. సోషల్ మీడియాలో కూడా హాట్ టాపిక్ మారింది. ముఖ్యంగా జానీ మాస్టర్ అరెస్ట్ అయిన దగ్గర నుంచి ఆయన భార్య ఆయేషా అలియాస్ సుమలత పేరు సోషల్ మీడియాలో తెగ మారు మోగిపోతుంది. ఎందుకంటే.. ఈ కేసులో ఆయేషా కూడా భాగం ఉందంటూ బాధితురాలు ఆమెపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. దీంతో జానీ మాస్టర్ తో పాటు ఆయేషా పై కూడా నెట్టింట పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ఎక్కడ ఎక్కడ చూసినా అయేషాకు సంబంధించిన ఇంటర్వ్యూలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయేషా.. నా భర్త నన్ను వదిలేయేలాని ఆ అమ్మాయ్ బెదిరించిందంటూ పలు షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆ వివరాల్లోకి వెళ్తే..

జానీ మాస్టర్ వివాదం టాలీవుడ్ లో తీవ్ర దుమారం రేపుతుంది. ముఖ్యంగా ఈ జానీ మాస్టర్ అత్యాచార ఆరోపణ కేసులో తన భార్య అయేషాకు ప్రమేయం ఉందని బాధితురాలు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.  అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జానీ మాస్టర్ భార్య వీటిపై స్పందించి సంచలన నిజాలు బయటపెట్టింది. ఇక ఆ ఇంటర్వ్యూలో సదరు జర్నలిస్ట్ ఆయేషాకు.. ‘బాధిత యువతి మిమ్మల్ని కూడా బెదిరించిందని కథనాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మీ భర్త మిమ్మల్ని వదిలేయాలని, తనని పెళ్లి చేసుకోవాలని, తనతో పిల్లలు కనాలని, లేదంటే చనిపోతానని బ్లాక్ మెయిల్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఇందులో ఎంతవరకు నిజముందో చెప్పాగలరా” అంటూ ప్రశ్నించారు.

ఇక ఈ ప్రశ్నకు స్పందించిన ఆయేషా మాట్లాడుతూ.. ”నా దగ్గర ఈ విషయాలన్నిటికి పక్కా ఆధారాలు ఉన్నాయి. ముఖ్యంగా మాస్టర్ ని ఇలా బ్లాక్ మెయిల్ చేసిన విషయం ఆ అమ్మాయి తల్లికి కూడా తెలుసు. కానీ ఇలా చేస్తారని అనుకోలేదు. కనుక సమయం వచ్చినప్పుడు ఎక్కడ పక్కా ఆధారాలతో సహా అన్నీ బయటపెడతాను. అన్నీ రుజువు చేస్తాను” అని ఆయేషా చెప్పుకొచ్చారు. అంతేకాకుండా.. ”మహిళ కోరియోగ్రాఫర్ వ్యవహారంలో జానీ తప్పు ఏమీ లేదు. ఆ అమ్మాయే మొదటి నుంచి జానీ మాస్టర్ పై కన్నేసింది. ఈ క్రమంలోనే ఆయనతో చాలా క్లోజ్ గా ఉండేది. మరోవైపు నన్ను వదినా అంటునే.. పక్కకి వెళ్లి జానీని బావ అని పిలిచేది. అందుకే ఓ సందర్భంలో ఆమె పై కోపం వచ్చి దాడి చేశానని, అది కూడ ఒక్కసారి మాత్రమే పలుమార్లు అయితే కాదని పేర్కొంది.

ముఖ్యంగా జానీ మాస్టర్ విషయంలో జరిగిదంతా ఓ హనీ ట్రాప్. ఈ మొత్తం వ్యవహారంలో ఆ అమ్మాయి తల్లికి కూడా భాగం ఉంది. వీళ్లంతా లగ్జరీ లైఫ్ కోసం, పైకి ఎదగాలనే ఒక ఆలోచన కోసం మాస్టర్ మైండ్ తో నా భర్తను వాడుకున్నారు. తీరా ఏదో చిన్న సమస్య రావడంతో.. నా భర్తను దోషిగా నిలబెట్టారు. నిజంగా నా భర్త మంచితనమే ఈరోజు ఆయనకు శాపంగా మారిందంటూ” ఆయేషా వివరించారు. మరి, బాధిత యువతి జానీ మాస్టర్ ను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసిందనే సమాచారం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.