గుండెజారి గల్లంతయ్యింది మూవీ సెకండ్ హీరోయిన్ రేంజ్.. ఇప్పుడు వేరే లెవల్!

నితిన్, న్యాచురల్ బ్యూటీ నిత్యామీనన్ కాంబోలో వచ్చిన చిత్రాల్లో ఒకటి గుండెజారి గల్లంతయ్యింది. ఇందులో సెకండ్ హీరోయిన్ గా నటించిన యాక్ట్రెస్ గుర్తుందా..? ఇప్పుడు ఏ స్థాయిలో ఉందో తెలుసా..?

నితిన్, న్యాచురల్ బ్యూటీ నిత్యామీనన్ కాంబోలో వచ్చిన చిత్రాల్లో ఒకటి గుండెజారి గల్లంతయ్యింది. ఇందులో సెకండ్ హీరోయిన్ గా నటించిన యాక్ట్రెస్ గుర్తుందా..? ఇప్పుడు ఏ స్థాయిలో ఉందో తెలుసా..?

నేషనల్ అవార్డు విన్నర్ నిత్యా మీనన్, టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ కాంబోలో రెండు చిత్రాలు వచ్చాయి. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఇష్క్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ మూవీ హిట్ కొట్టడంతో ఇదే పెయిర్‌తో కలిసి వెంటనే గుండెజారి గల్లంతయ్యిందే సినిమా పట్టాలెక్కింది. ప్రముఖ కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ హర్ష వర్దన్ కథ అందించగా.. కొత్త దర్శకుడు విజయ్ కుమార్ కొండ తెరకెక్కించాడు. 2013లో విడుదలైన ఈ పిక్చర్ కూడా హిట్ టాక్ తెచ్చుకుంది. అనూప్ రూబెన్స్ అందించిన పాటలు ఈ మూవీకి హైలెట్‌గా నిలిచాయి. నిత్యామీనన్ కాకుండా మరో బ్యూటీ కూడా యాక్ట్ చేసింది. మధు నందన్ లవర్ గా కనిపించింది. శృతి పాత్రలో మెప్పించింది నటి ఇషా తల్వార్. ముంబయికి చెందిన ఈ భామ సౌత్ ఇండస్ట్రీ నుండే కెరీర్ స్టార్ట్ చేసింది. కానీ ఓ వెబ్ సిరీస్‌తో ఫేమ్ తెచ్చుకుంది.

తండ్రి వారసత్వాన్ని తీసుకుని ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది ఇషా. తండ్రి వినోద్ తల్వార్ బాలీవుడ్ నటుడు. చైల్ట్ ఆర్టిస్టుగా యాక్ట్ చేసింది. హమారా దిల్ అప్కే పాస్ హై మూవీలో ఐశ్వర్య రాయ్ చెల్లెలిగా నటించింది. ఇషా సూపర్ టాలెంటర్. చిన్నప్పటికి నుండే బ్యాలెట్, జాజ్, హిప్, హప్, సల్సా వంటి డ్యాన్సులను నేర్చుకుంది. ఆ తర్వాత డ్యాన్స్ స్టూడియోలో కొరియోగ్రాఫర్‌గా కూడా మారింది. మెల్లిగా మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. అలా 40కి పైగా కమర్షియల్ యాడ్స్ చేసింది ఈ బ్యూటీ. నటిగా ఆమెకు తొలి అవకాశం ఇచ్చింది మలయాళ ఇండస్ట్రీ. మాలీవుడ్ లో రెండు సినిమాలు చేశాక వచ్చిన ఆఫరే గుండెజారి గల్లంతయ్యింది. ఇందులో సెకండ్ హీరోయిన్‌గా కనిపిస్తుంది.  ఈమె తన బంగారం అనుకుని.. ఇషా వెంటపడుతుంటాడు నితిన్. ఇషా.. మధునందన్‌ని ఇష్టపడుతుంది. ఇందులో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి.

తిరిగి మలయాళంలో వరుస సినిమాలు చేసింది. బెంగళూరు డేస్, టూ కంట్రీస్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటిచింది. తెలుగులో మైనే ప్యార్ కియా, రాజా చెయి వేస్తే చిత్రాల్లో యాక్ట్ చేసింది. ఈ సినిమాల తర్వాత ఆమె తెలుగులో కనిపించలేదు. హిందీ, మలయాళ చిత్రాల్లో బిజీగా మారిపోయింది.ఆర్టికల్ 15 మూవీ దగ్గర నుండి వరుసగా ఐదారు హిందీ చిత్రాలు చేసింది. గత ఏడాది తమిళంలో ఐశ్వర్య రాజేష్, ఆర్జే బాలాజీ మెయిన్ రోల్స్ చేసిన రన్ బేబీ రన్‌లో బాలాజీ ఉడ్బీగా కనిపించింది. వీటన్నింటి కన్నా.. ఆమెకు బాగా గుర్తింపు తెచ్చింది మాత్రం మీర్జాపూర్ వెబ్ సిరీస్. ఇందులో మున్నా భార్యగా.. తండ్రి చనిపోయాక.. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా నటించింది. ఇందులో ఆమెకు మంచి గుర్తింపు లభించింది. ఇటీవల ఇండియన్ పోలీస్ ఫోర్స్ సిరీస్‌తో పలకరించింది. ప్రస్తుతం షాకోట్ మూవీలో నటిస్తుంది. మొత్తానికి సౌత్, నార్త్ దున్నేస్తోంది ఈ బ్యూటీ.

Show comments