ఈ ఖోఖో యాంకరమ్మ ఎవరో గుర్తు పట్టారా..? స్టార్ హీరోయిన్ ఇలా!

ఖోఖో ప్రజెంటర్‌గా కనిపిస్తున్న ఈ బ్యూటీని గుర్తు పట్టారా..? ఆమె యాంకర్ అనుకుంటే పప్పులో కాలేసినట్లే.. ఆమె టాలీవుడ్ హీరోయిన్. నందమూరి, మెగా వారసులతో ఆడిపాడిందీ బ్యూటీ. ఇంతకు ఎవరో తెలుసా..?

ఖోఖో ప్రజెంటర్‌గా కనిపిస్తున్న ఈ బ్యూటీని గుర్తు పట్టారా..? ఆమె యాంకర్ అనుకుంటే పప్పులో కాలేసినట్లే.. ఆమె టాలీవుడ్ హీరోయిన్. నందమూరి, మెగా వారసులతో ఆడిపాడిందీ బ్యూటీ. ఇంతకు ఎవరో తెలుసా..?

ఈ ఫోటోలో ఖోఖో ప్రజెంటర్‌గా వ్యవహరిస్తున్న ఈ యాంకరమ్మను గుర్తుపట్టారా.? ఆమె టాలీవుడ్ హీరోయిన్ అని తెలుసా..? న్యూస్ యాంకర్ నుండి కెరీర్ స్టార్ట్ చేసి.. ఇప్పుడు స్పోర్ట్స్ ప్రజెంటర్‌గా, యాక్రెస్ట్‌గా కొనసాగుతుంది. టాలీవుడ్ యంగ్ హీరోలతో ఆడిపాడిన ఈ బ్యూటీ.. ఫస్ట్ మూవీతోనే మంచి మార్కులు కొట్టేసింది. ఇటు నందమూరి వారసుడితోనూ, ఇటు మెగా వారసుడితోనూ యాక్ట్ చేసింది. కానీ తెలుగులో క్లిక్ అవ్వాల్సిన ఈ బ్యూటీకి అవకాశాలు రాలేదో లేదా ఇతర కారణాలో తెలియదు కానీ.. టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి క్విట్ అయ్యింది. ఇంతకు ఆ లేడీ స్పోర్ట్స్ ప్రజెంటర్ ఎవరంటే.. నందమూరి కళ్యాణ్ రామ్-అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన పటాస్ మూవీ హీరోయిన్ శృతి సోది. ఢిల్లీలో పుట్టిన ఈ డాల్.. ఫిలాసఫీలో ఎడ్యుకేషన్ పూర్తి చేసింది.

చదువులు పూర్తయ్యాక.. బుల్లితెరపై యాంకరమ్మగా అవతారం ఎత్తింది. హిందీలో న్యూస్ ఎక్స్ , మరో ఛానల్లో న్యూస్ ప్రజెంటర్‌గా వర్క్ చేసింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత పంజాబీ చిత్రాల్లో నటించింది. హ్యాపీ గోలక్కీ అనే చిత్రంతో పంజాబీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. మిస్ అండ్ మిస్టర్ 420లో మెరిశాక.. తెలుగులో పటాస్ చిత్రంలో నటించింది. ఇందులో రౌడీ ఇన్ స్పెక్టర్ అరే ఓ సాంబ సాంగ్ రీమిక్స్ చేయగా.. కేక పుట్టించింది ఈ భామ. తన డ్యాన్సుతో, స్టెప్పులతో పాటకు మరింత హైప్ తెచ్చిందీ బ్యూటీ. ఈ సినిమా హిట్ కొట్టాక..టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్ అయిపోతుందని అనుకున్నారు. కానీ ఆ తర్వాత అనిల్ రావిపూడి- సాయి తేజ్ కాంబోలో వచ్చిన సుప్రీమ్ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్‌లో ఆడిపాడింది.

ఆ తర్వాత నవీన్ చంద్ర హీరోగా వచ్చిన మీలో ఎవరు కోటీశ్వరుడు చిత్రంలో ప్రియ క్యారెక్టర్‌లో మెరిసింది. ఇదే తెలుగులో చివరి సినిమా.  బుద్దీస్ ఇన్ ఇండియా.. హిందీలో అబ్ డిల్లీ దూర్ నహి అనే చిత్రంలో మెరిసింది. అలాగే పంజాబీ సాంగ్స్ చేసింది. కానీ ఇప్పుడు స్పోర్ట్స్ ప్రజెంటర్‌గా వ్యవహరిస్తుంది. మళ్లీ బుల్లితెరపై సందడి చేస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో తొమ్మిది లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ప్రస్తుతం కొత్త కథలు వింటోంది ఈ బ్యూటీ. సామాజిక మాధ్యమాల్లో తన ఫోటోలు షేర్ చేస్తూ ఎప్పుడూ ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటున్న ఈ పంజాబీ హీరోయిన్.. తెలుగులో కూడా మళ్లీ ఆఫర్లు వచ్చి బిజీ కావాలని ఆశిద్దాం.

Show comments