iDreamPost
android-app
ios-app

ప్రముఖ కార్ల తయారీ కంపెనీపై 50 కోట్ల దావా వేసిన రిమీ సేన్

  • Published Aug 22, 2024 | 7:49 PM Updated Updated Aug 22, 2024 | 8:36 PM

Chiranjeevi Heroine 50 Crore Sues To Car Company: ఒకప్పుడు చిరంజీవి సరసన నటించిన హీరోయిన్ ఇప్పుడు ఓ విషయంలో ప్రముఖ కంపెనీపై 50 కోట్ల రూపాయల దావా వేసింది. తనకు జరిగిన నష్టానికి 50 కోట్లు పరిహారంగా ఇవ్వాలని కోరుతూ నోటీసులు పంపించింది.

Chiranjeevi Heroine 50 Crore Sues To Car Company: ఒకప్పుడు చిరంజీవి సరసన నటించిన హీరోయిన్ ఇప్పుడు ఓ విషయంలో ప్రముఖ కంపెనీపై 50 కోట్ల రూపాయల దావా వేసింది. తనకు జరిగిన నష్టానికి 50 కోట్లు పరిహారంగా ఇవ్వాలని కోరుతూ నోటీసులు పంపించింది.

ప్రముఖ కార్ల తయారీ కంపెనీపై 50 కోట్ల దావా వేసిన రిమీ సేన్

ప్రముఖ హీరోయిన్, బిగ్ బాస్ 9 కంటెస్టెంట్ రిమీ సేన్ 50 కోట్ల రూపాయల పరిహారం కోరింది. ప్రముఖ కార్ల తయారీ కంపెనీపై దావా వేసింది. తన కారులో తలెత్తిన అనేక సమస్యల కారణంగా ఆమె నవనీత్ మోటార్స్, జాగ్వార్ ల్యాండ్ రోవర్, సతీష్ మోటార్స్ లకు నోటీసులు పంపించింది. శుభమిత్ర సేన్ పేరుతో రిమీ సేన్ ఈ నోటీసులను పంపించింది. ఈమె అసలు పేరు శుభమిత్ర సేన్. 2022 ఆగస్టు 25న ఒక ఘటన జరిగింది. ఆ సమయంలో కారులోని రేర్ ఎండ్ కెమెరా పని చేయలేదు. దీని వల్ల ఆమె కారు రివర్స్ చేస్తూ పిల్లర్ ని ఢీకొట్టింది. అప్పటికే తన కారులో తలెత్తిన సమస్యలను పరిష్కరించమని సంబంధిత డీలర్ షిప్లను పది సార్లు పైనే సందర్శించింది. ఎన్నిసార్లు సర్వీస్ సెంటర్లకు వెళ్లినా గానీ కారులో తలెత్తిన సమస్యలు అలానే ఉన్నాయని రిమీ సేన్ పేర్కొంది.

దీంతో తాను విసుగు చెందానని.. మానసికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కున్నానని ఆమె వెల్లడించింది. తనకు జరిగిన నష్టానికి పరిహారంగా 50 కోట్లు చెల్లించాలని ఆమె కోరింది. ఈ మేరకు డీలర్ షిప్ వారికి, కారు తయారీ కంపెనీలకు లీగల్ నోటీసులు పంపించింది. 50 కోట్ల రూపాయల పరిహారంతో పాటు చట్టపరమైన ఖర్చులను భరించడానికి అదనంగా రూ. 10 లక్షలు ఇవ్వాలని కోరింది. ఓ మీడియా ఛానల్ తో మాట్లాడుతూ.. తాను కారు కంపెనీ, దాని సర్వీస్ పట్ల పూర్తిగా నిరాశ చెందానని.. కొన్ని కంపెనీలు కస్టమర్స్ పట్ల శ్రద్ధ వహించడం లేదని పేర్కొంది. సమస్యను పరిష్కరించకపోవడం వల్లే తాను పిల్లర్ ను ఢీ కొట్టాల్సి వచ్చిందని తెలిపింది.

ఆ సమయంలో మనిషి ఉంటే ఎంత నష్టం జరిగి ఉండేదో ఊహించవచ్చునని.. వారి నిర్లక్ష్యం కారణంగా ఒక ప్రాణం పోయి ఉండేదని ఆమె వెల్లడించింది. అందుకే కంపెనీ మీద, డీలర్ షిప్ వారి మీద పరువు నష్టం దావా వేశానని.. తనకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నా అని ఆమె చెప్పుకొచ్చింది. ఈమె 2001లో వచ్చిన ‘ఇదే నా మొదటి ప్రేమలేఖ’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత దీపక్, ఛార్మి నటించిన ‘నీ తోడు కావాలి’ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించింది. 2005లో వచ్చిన చిరంజీవి నటించిన అందరివాడు సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీలో చిరంజీవి డ్యూయల్ రోల్ లో నటించగా.. రెండో చిరంజీవి పాత్రధారికి జోడీగా నటించింది. బాలీవుడ్ బిగ్ బాస్ సీజన్ 9లో కూడా పార్టిసిపేట్ చేసింది.