iDreamPost
android-app
ios-app

పెద్ద హిట్ అయిన ఆరుగురు పతివ్రతలు మూవీ రీరిలీజ్.. ఎప్పుడంటే?

  • Published Feb 01, 2024 | 4:06 PM Updated Updated Feb 01, 2024 | 4:06 PM

ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు రీ రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అలరించి.. రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ కొల్లగొడుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలోనే అప్పటిలో సెన్సేషన్ గా నిలిచిన ఆరుగురు పతివ్రతలు సినిమా త్వరలోనే రీ రిలీజ్ కానుంది. ఇంతకి అది ఎప్పుడంటే..

ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు రీ రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అలరించి.. రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ కొల్లగొడుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలోనే అప్పటిలో సెన్సేషన్ గా నిలిచిన ఆరుగురు పతివ్రతలు సినిమా త్వరలోనే రీ రిలీజ్ కానుంది. ఇంతకి అది ఎప్పుడంటే..

  • Published Feb 01, 2024 | 4:06 PMUpdated Feb 01, 2024 | 4:06 PM
పెద్ద హిట్ అయిన ఆరుగురు పతివ్రతలు మూవీ  రీరిలీజ్.. ఎప్పుడంటే?

ప్రస్తుతం టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ అనేది ఎక్కువగా కొనసాగుతుంది. గతంలో ఎన్నో సూపర్ హిట్ గా నిలిచిన అగ్ర హీరోల సూపర్ హిట్ సినిమాలను రీ రిలీజ్ చేసి భారీ వసూళ్లను నిర్మాతలు అందుకునేవారు‌. అయితే ఇప్పుడు ఇదే టెక్నిక్ ను ప్రేక్షకులను థీయేటర్లకు రాబెట్టడానికి ఉపాయోగిస్తున్నారు. ఇప్పటికే పలువురు స్టార్ హీరోల సినిమాలు వారి పుట్టినరోజు సందర్భంగా రీరిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే.. సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన, పోకిరి, బిజినెస్ మాన్, అలాగే ప్రభాస్ నటించిన రెబల్, బిల్లా, వర్షం వంటి పలువురు హీరోలు నటించిన చిత్రాలను రీ రిలీజ్ చేసి భారీ వసూళ్లు సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరో సినిమాను తెర పై రీ రిలీజ్ చేయాలంటూ సినీ ప్రియులు డిమాండ్ చేస్తున్నారు. కాగా, అప్పటిలో ఈ సినిమా ఓ సెన్సేషన్ అనే చెప్పాలి. ఇంతకి ఆ సినిమా ఏదంటే.. ‘ఆరుగురు పతివ్రతలు’. ఈ సినిమాను అతి త్వరలో రీ రిలీజ్ చేస్తున్నారనే వార్త ఇప్పుడు నెట్టింట హట్ టాపిక్ గా మారింది. ఇంతకి అది ఎప్పుడంటే..

ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు రీ రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అలరించి.. రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ కొల్లగొడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అప్పట్లో సెన్సేషన్ గా మారిన చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ సినిమానే ఆరుగురు పతివ్రతలు. ఈ సినిమాను దివంగత దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించారు. 2004లో ఈ సినిమాను రోమాంటిక్ డ్రామాగా తెరకెక్కించారు. అయితే ఇప్పుడు ఈ సినిమాను మళ్లీ రీ రిలీజ్ చేయాలని చాలామంది సోషల్ మీడియాలో పెద్ద ఎత్తునే కామెంట్స్ చేస్తున్నారు. కాగా, ఆరుగురు పతివ్రతలు సినిమా ఈ ఫ్రిబవరి 6కు రిలీజ్ అయ్యి 20 సంవత్సరాలు పూర్తి అవుతుంది. దీంతో మళ్లీ ఈ ఫిబ్రవరి 6న ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తారంటూ సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది. ఇక ఈ సినిమాలలో మొత్తం 43 మంది కొత్త ఆర్టిస్ట్ లు నటించారు. వారిలో చలపతిరావు, ఎల్.బి.శ్రీరామ్‌, శ్రీకృష్ణ కౌశిక్ తదితర నటినటులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఇక సినిమాకు కమలాకర్ సంగీతాన్ని అందించారు. మరి, ఆరుగురు పతివ్రతలు సినిమా రీ రిలీజ్ అవుతుందనే వార్త పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

View this post on Instagram

 

A post shared by Tag Telugu (@tag.telugu)