P Venkatesh
మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నట్లైతే మీకు గుడ్ న్యూస్. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. కేవలం పదో తరగతి అర్హతతో ఈ ఉద్యోగాలన భర్తీ చేయనుంది.
మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నట్లైతే మీకు గుడ్ న్యూస్. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. కేవలం పదో తరగతి అర్హతతో ఈ ఉద్యోగాలన భర్తీ చేయనుంది.
P Venkatesh
మీరు పదో తరగతి ఉత్తీర్ణులయ్యారా? టెన్త్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీకు ఓ శుభవార్త. కేవలం పదో తరగతి పాసైతే చాలు మీరు ఈ ప్రభుత్వ ఉద్యోగాలను సాధించే అవకాశం ఉంది. మళ్లీ మళ్లీ ఇటువంటి నోటిఫికేషన్ రాదు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రభుత్వ ఉద్యోగాన్ని పొంది జీవితంలో స్థిరపడండి. తాజాగా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రక్రియను చేపట్టింది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 484 పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.
ముంబయిలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు గుడ్ న్యూస్ తెలిపింది. దేశ వ్యాప్తంగా ఉన్న సీబీఐ శాఖల్లో సఫాయి కర్మచారి కమ్ సబ్-స్టాఫ్/ సబ్-స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎస్ఎస్సీ/ పదో తరగతి అర్హతతో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు డిసెంబరు 20 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. అభ్యర్థులు పూర్తి వివరాల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్ సైట్ https://centralbankofindia.co.in/ ను పరిశీలించాల్సి ఉంటుంది.