iDreamPost
android-app
ios-app

టెన్త్ పాసైతే చాలు.. ఈ ప్రభుత్వ ఉద్యోగాలు మీకోసమే.. త్వరగా అప్లై చేసుకోండి

మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నట్లైతే మీకు గుడ్ న్యూస్. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. కేవలం పదో తరగతి అర్హతతో ఈ ఉద్యోగాలన భర్తీ చేయనుంది.

మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నట్లైతే మీకు గుడ్ న్యూస్. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. కేవలం పదో తరగతి అర్హతతో ఈ ఉద్యోగాలన భర్తీ చేయనుంది.

టెన్త్ పాసైతే చాలు.. ఈ ప్రభుత్వ ఉద్యోగాలు మీకోసమే.. త్వరగా అప్లై చేసుకోండి

మీరు పదో తరగతి ఉత్తీర్ణులయ్యారా? టెన్త్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీకు ఓ శుభవార్త. కేవలం పదో తరగతి పాసైతే చాలు మీరు ఈ ప్రభుత్వ ఉద్యోగాలను సాధించే అవకాశం ఉంది. మళ్లీ మళ్లీ ఇటువంటి నోటిఫికేషన్ రాదు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రభుత్వ ఉద్యోగాన్ని పొంది జీవితంలో స్థిరపడండి. తాజాగా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రక్రియను చేపట్టింది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 484 పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.

ముంబయిలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు గుడ్ న్యూస్ తెలిపింది. దేశ వ్యాప్తంగా ఉన్న సీబీఐ శాఖల్లో సఫాయి కర్మచారి కమ్ సబ్-స్టాఫ్/ సబ్-స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎస్‌ఎస్‌సీ/ పదో తరగతి అర్హతతో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు డిసెంబరు 20 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. అభ్యర్థులు పూర్తి వివరాల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్ సైట్ https://centralbankofindia.co.in/ ను పరిశీలించాల్సి ఉంటుంది.

ముఖ్యమైన సమాచారం:

మొత్తం పోస్టులు:

  • 484 సఫాయి కర్మచారి కమ్ సబ్-స్టాఫ్/ సబ్-స్టాఫ్

జోన్లు, రాష్ట్రాల వారీగా ఖాళీలు:

  • అహ్మదాబాద్ (గుజరాత్) జోన్ లో 76 పోస్టులు

రీజియన్:

  • అహ్మదాబాద్- 12, బరోడా- 17, గాంధీనగర్- 21, జామ్‌నగర్ – 11, సూరత్- 15.

భోపాల్ జోన్ లో (మధ్యప్రదేశ్- 24, ఛత్తీస్‌గఢ్- 14): 38

  • రీజియన్:
  • భోపాల్ – 14, ఇండోర్- 10, రాయ్‌పూర్- 14.

ఢిల్లీ జోన్ లో (ఢిల్లీ- 21, రాజస్థాన్- 55): 76

  • రీజియన్:
  • ఢిల్లీ ఎ(సౌత్)- 13, ఢిల్లీ బి(నార్త్)- 8, జైపూర్- 15, కోట- 20, జోధ్‌పూర్- 20.

కోల్‌కతా జోన్ లో (ఒడిషా): 02

  • రీజియన్:
  • భువనేశ్వర్- 2.

లక్నో జోన్ లో (ఉత్తర ప్రదేశ్) : 78

  • రీజియన్:
  • బరేలీ- 3, ఇటావా- 9, డియోరియా- 10, గోరఖ్‌పూర్-18, ఝాన్సీ- 7, కాన్పూర్- 7, లక్నో- 12, వారణాసి – 12.

ఎంఎంజెడ్‌వో & పుణె (మహారాష్ట్ర)- జోన్ లో 118

  • రీజియన్:
  • ముంబయి- 12, అమరావతి – 27, నాగ్‌పూర్ – 18, అహ్మద్‌నగర్- 18, ఔరంగాబాద్ – 13, నాసిక్ – 16, పూణే – 15.

పాట్నా జోన్ లో – 96 (బిహార్- 76, ఝార్ఖండ్- 20)

  • రీజియన్:
  • దర్భంగా- 7, మోతీహరి- 11, ముజఫర్‌పూర్- 11, సివాన్- 13, పాట్నా- 14, గయ – 10, పూర్ణ – 10, ధన్‌బాద్- 10, రాంచీ- 10.

అర్హత:

  • అభ్యర్థులు ఎస్‌ఎస్‌సీ/ పదోతరగతి పాసై ఉండాలి.

వయోపరిమితి:

  • అభ్యర్థులు 18 – 26 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం కేటాగిరి వర్గాల వారికి వయోసడలింపు వర్తిస్తుంది.

దరఖాస్తు ఫీజు:

  • జనరల్ అభ్యర్థులు రూ.850. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈఎస్‌ఎం అభ్యర్థులు రూ.175 చెల్లించాలి.

దరఖాస్తు విధానం:

  • ఆన్‌ లైన్

ఎంపిక విధానం:

  • ఆన్‌లైన్ పరీక్ష, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

జీతం:

  • ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.14,500- రూ.28145 అందిస్తారు.

దరఖాస్తు ప్రారంభం:

  • 20-12-2023.

దరఖాస్తు చివరి తేదీ:

  • 09-01-2024.

అధికారిక వెబ్ సైట్:

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి