స్టూడెంట్ తో టీచర్ పిచ్చి చేష్టలు.. విద్యార్థులను కాపలా పెట్టి మరీ…

తల్లిదండ్రులు పిల్లలకు జన్మనిస్తే.. వారికి చక్కటి విద్యాబుద్దులు నేర్పించి సమాజంలో గొప్ప పొజీషన్ కి తీసుకువస్తారు గురువులు.

తల్లిదండ్రులు పిల్లలకు జన్మనిస్తే.. వారికి చక్కటి విద్యాబుద్దులు నేర్పించి సమాజంలో గొప్ప పొజీషన్ కి తీసుకువస్తారు గురువులు.

విద్యార్థులకు విద్యాబుద్దులు, క్రమశిక్షణ నేర్పించి వారికి బంగారు భవిష్యత్ అందించడంలో గురువులు కీలక పాత్ర పోషిస్తారు. అందుకే గురువులను త్రిమూర్తులతో పోల్చారు. తల్లిదండ్రుల తర్వాత అంత గొప్ప స్థానం గురువులకే ఇస్తారు. అనాధి నుంచి గురుశిష్యుల మధ్య గొప్ప అనుబంధం ఉంటుంది. కానీ ఈ మధ్య కాలంలో గురువు స్థానానికి మచ్చే తెచ్చే దారుణ ఘటనలు వెలుగు చూస్తున్నాయి. విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించడం, మద్యం సేవించి రావడం ఇంకా ఎన్నో దారుణాలకు తెగబడుతున్నారు. తాజాగా ఓ విద్యార్థితో పాడు పనులు చేస్తూ పోలీసులకు దొరికిపోయింది టీచర్. వివరాల్లోకి వెళితే..

అమెరికాలో మిస్సోరీలో హేయమైన ఘటన వెలుగు చూసింది. మిస్సోరిలోని ఓ హైస్కూల్ మ్యాథ్స్ టీచర్ గా పని చేస్తుంది హేలీ క్లిఫ్టన్(26). కార్మాక్ అనే 16 ఏళ్ల విద్యార్థితో సంబంధం పెట్టుకొని అతనితో పాడు పనులకు తెగపడింది. తాను పాడు పనులు చేసే సమయంలో కొంతమంది విద్యార్థులను కాపలా పెట్టడం గమనార్హం. ఈ ఘటన విద్యార్థి వీపుపై ఉన్న గోళ్ల గీతలు మరో విద్యార్థికి ఫోన్ లో చూపించడం తో విషయం బయటకు వచ్చింది. దీంతో ఆ విద్యార్థి తల్లిదండ్రులు హైలీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

హైలీ విద్యార్థితో సంబంధం పెట్టుకున్న విషయం తెలిసి ఆమెను వదిలేసాడని విచారణలో తేలింది. కార్మిక్ అనే విద్యార్థిని తన ఇంటికి పిలిచి అతనితో ఇల్లీగల్ పనులు చేసేదని కొంతమంది సాక్షులు వెల్లడించినట్లు సమాచారం.  ప్రస్తుతం హేలీ క్లిఫ్టన్ హౌస్ అరెస్ట్ లో ఉంది. స్థానిక కోర్టు ఆమెకు నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. అక్టోబర్ 11 నుంచి హైలీకి జైలు శిక్ష అమలు కానున్నట్లు తెలుస్తుంది. అప్పటి వరకు హైలీ హౌస్ అరెస్ట్ లో ఉంచాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. గతంలో కూడా ఆమై విద్యార్థులను అసభ్యంగా వేధించడం, అత్యాచారాలకు పాల్పపడటం,  కొట్టిన కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పించాల్సిన గొప్ప స్థానంలో ఉన్న ఆమె ఇలాంటి అసభ్యకరమైన పనులు చేయడంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి.

Show comments