వీడియో వైరల్: అంత్యక్రియలు ఆపేసి మ్యాచ్‌ను చూసిన ఫ్యామిలీ!

వీడియో వైరల్: అంత్యక్రియలు ఆపేసి మ్యాచ్‌ను చూసిన ఫ్యామిలీ!

ప్రస్తుత కాలంలో స్పోర్ట్స్ అంటే ఇష్టపడని వారంటూ ఎవ్వరూ ఉండరు. ఇక ఈ విషయంలో చిన్న నుంచి పెద్ద వరకు అందరూ ఈ స్పోర్ట్స్ ఆడటం, చూడటంలో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. మరి ఈ స్పోర్ట్స్ విషయంలోకి వచ్చినప్పుడు చాలామంది ఎక్కువగా క్రికెట్ ఎంతో ఇష్టపడతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇకపోతే తాజాగా ఓ ఇంట్లో సంతాప కార్యక్రమాలు జరుగుతున్న వేళ ఆ కుటుంబం మ్యాచ్ మీద ఆసక్తితో ఏం చేశారో తెలిస్తే ఆశ్చర్యపోతారు.

ప్రస్తుత కాలంలో స్పోర్ట్స్ అంటే ఇష్టపడని వారంటూ ఎవ్వరూ ఉండరు. ఇక ఈ విషయంలో చిన్న నుంచి పెద్ద వరకు అందరూ ఈ స్పోర్ట్స్ ఆడటం, చూడటంలో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. మరి ఈ స్పోర్ట్స్ విషయంలోకి వచ్చినప్పుడు చాలామంది ఎక్కువగా క్రికెట్ ఎంతో ఇష్టపడతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇకపోతే తాజాగా ఓ ఇంట్లో సంతాప కార్యక్రమాలు జరుగుతున్న వేళ ఆ కుటుంబం మ్యాచ్ మీద ఆసక్తితో ఏం చేశారో తెలిస్తే ఆశ్చర్యపోతారు.

ఈరోజుల్లో స్పోర్ట్స్ అంటే ఇష్టపడని వారంటూ ఎవ్వరూ ఉండరు. ఇక ఈ విషయంలో చిన్న నుంచి పెద్ద వరకు అందరూ ఈ స్పోర్ట్స్ ఆడటం, చూడటంలో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. మరి ఈ స్పోర్ట్స్ విషయంలోకి వచ్చినప్పుడు చాలామంది ఎక్కువగా క్రికెట్ ఎంతో ఇష్టపడతారు. పైగా దీనిని చూడటానికైనా, ఆడటానికైనా చాలా ఆసక్తి చూపిస్తారు. ఒక రకంగా చెప్పాలంటే..మన దేశంలో క్రికెట్ లవర్స్ లేని వారంటూ ఎవరూ ఉండరు. అయితే ఇండియాలో క్రికెట్ ను ఎంత ఎక్కువగా ఇష్టపడతారో.. ప్రపంచ దేశాల్లో ఫుట్ బాలు క్రీడాను అంత ఎక్కువగా ఇష్టపడతారు. ముఖ్యంగా అక్కడంతా సాకర్ ఫీవర్ అనేది కొనసాగుతుంటుంది.

ఈ క్రమంలోనే ప్రపంచ వ్యాప్తంగా ఫుట్ బాల్ ప్రియులు మ్యాచ్ లు జరుగుతున్నప్పుడు ఎన్ని పనులు ఉన్నా.. తమ పనులను పక్కన పెట్టి మరీ టీవీకి అతుక్కుపోతారు. ఇక ఆ సమయంలో ఏం జరిగినా సరే.. తామకు పట్టనట్టుగా అందులో ముగ్ధులవుతారు. ఇక అందుకు నిదర్శనంగా తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతుంది. ఓ వైపు ఇంట్లో విషాద ఛాయలు అలుముకుంటే మరో వైపు ఫుట్ బాల్ ఆట పిచ్చిలో పడి అలా చేసిన ఘటన అందర్నీ ఆశ్చర్యనికి గురి చేసింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..  ఓ ఇంట్లో ముఖ్యమైన సభ్యుడు మరణించాడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ క్రమంలోనే అంత్యక్రియలు కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఒక్కసారిగా ఆ ఇంట్లో అంత్యక్రియల పనులు నిలిచిపోయాయి. అందరూ కుర్చీలలో కూర్చొని టీవీ చూస్తున్నారు. ఎందుకంటే.. ఒక పెద్ద తెరపై ఫుట్‌బాల్ మ్యాచ్ ప్రసారం అవుతుంది.

దీంతో మృతదేహానికి చేయాల్సిన అంత్యక్రియలను పక్కకు పెట్టి.. కుటుంబం మొత్తం ఫుట్ బాల్ మ్యాచ్ ను చూడడంలో లీనమైంది. అయితే ఈ విచిత్ర ఘటన దక్షిణ అమెరికాలోని జరిగింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  ఇకపోతే ఆ వీడియోలో  చిలీ, పెరూ మధ్య కోపా అమెరికా ఫుట్‌బాల్ మ్యాచ్ జరుగుతోంది. మరో వైపు ఆ కుటుంబంలో సంతాప కార్యక్రమం కొనసాగుతోంది. కానీ, దానిని నిలిపివేసి శవ పేటికను పెట్టిన గదిలో భారీ ప్రొజెక్టర్ స్క్రీన్‌పై మ్యాచ్‌ ప్రసారం చేస్తూ అందులో కుటుంబమంతా లీనమైపోయారు. దీంతో ఎక్కడి పనులు అక్కడే పెట్టి.. కుటుంబ సభ్యులు, అతిథులు అందరూ కలిసి చిలీ జెర్సీలు ధరించి మ్యాచ్‌ను వీక్షించారు. ఈ సమయంలో శవపేటిక పైన పూల గుత్తితో పాటు చిలీ జెర్సీని కూడా ఉంచారు.

కాగా, ఈ వీడియో కాస్త వైరల్ కావడంతో సోషల్ మీడియాలో భారీ స్పందన వస్తుంది.  ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్స్..  కుటుంబీకుల నిర్ణయంతో ఓ వైపు ఆశ్చర్యం వ్యక్తం చేయగా.. మరికొందరు మరణించిన వ్యక్తి ఫుట్‌బాల్ అభిమాని అయి ఉండవచ్చు అంటూ ఫన్నీ కామెంట్స్ చేశఆరు. అలాగే మరొ కొంతమంది   అంతిమ యాత్ర సమయంలో కుటుంబసభ్యులు మరణించిన వ్యక్తుల ఇష్టాన్ని ప్రేమని గౌరవించారు. అతనితో కలిసి చివరి మ్యాచ్‌ని చూశారని కామెంట్ పెట్టారు. ఇక ఓ వ్యక్తి అయితే మ్యాచ్ స్కోర్ చూసి శవం లేచి కూర్చోకపోతే చచ్చినట్టు లెక్క అని ఫన్నీ కామెంట్ చేశారు. మరి, ఇంట్లో సంతాప కార్యక్రమం కొనసాగుతుండగా మరోవైపు మ్యాచ్ చూసుకుంటున్న ఈ ఘటన పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments