iDreamPost
android-app
ios-app

విద్యార్థులకు HDFC గుడ్ న్యూస్.. ఏకంగా 75 వేల స్కాలర్‌షిప్.. వెంటనే అప్లై చేసుకోండి

  • Published Jul 22, 2024 | 6:40 PM Updated Updated Jul 22, 2024 | 6:40 PM

HDFC Bank Parivartan's ECSS Programme 2024-25: విద్యార్థులకు గుడ్ న్యూస్. ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ నిరుపేద విద్యార్థుల కోసం స్కాలర్ షిప్స్ అందిస్తోంది. ఏకంగా రూ. 75 వేల వరకు పొందొచ్చు. ఇప్పుడే అప్లై చేసుకోండి.

HDFC Bank Parivartan's ECSS Programme 2024-25: విద్యార్థులకు గుడ్ న్యూస్. ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ నిరుపేద విద్యార్థుల కోసం స్కాలర్ షిప్స్ అందిస్తోంది. ఏకంగా రూ. 75 వేల వరకు పొందొచ్చు. ఇప్పుడే అప్లై చేసుకోండి.

  • Published Jul 22, 2024 | 6:40 PMUpdated Jul 22, 2024 | 6:40 PM
విద్యార్థులకు HDFC గుడ్ న్యూస్.. ఏకంగా 75 వేల స్కాలర్‌షిప్.. వెంటనే అప్లై చేసుకోండి

నేటి రోజుల్లో చదువుకోవాలంటే.. చదువు కొనాలనే పరిస్థితి దాపరించింది. తమ పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ అందించడం కోసం లక్షల రూపాయలను వెచ్చిస్తున్నారు తల్లిదండ్రులు. ఇక నిరుపేద విద్యార్థులు ఆర్థిక పరిస్థితుల కారణంగా చదువు మధ్యలోనే ఆపేసి కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటూ పనుల్లో నిమగ్నమైపోతున్నారు. ప్రతిభ ఉండి కూడా డబ్బు లేని కారణంగా విద్యకు దూరమవుతున్నారు. ఇలాంటి విద్యార్థులకు గుడ్ న్యూస్ అందించింది ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంక్ హెచ్ డీఎఫ్ సీ. నిరుపేద విద్యార్థులకు ఏకంగా 75 వేల వరకు స్కాలర్ షిప్ అందించేందుకు ఓ ప్రోగ్రామ్ ను స్టార్ట్ చేసింది.

ప్రతిభావంతులైన నిరుపేద విద్యార్థుల విద్య కోసం హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ పరివర్తన్స్ ఎడ్యుకేషనల్ క్రైసిస్ స్కాలర్ షిప్ సపోర్ట్ ప్రోగ్రామ్ పేరుతో ఆర్థిక చేయూతనందిస్తోంది. 1వ తరగతి నుంచి పీజీ వరకు విద్యనభ్యసించే పేద విద్యార్థులు ఈ స్కాలర్ షిప్ కు అర్హులు. 1-12వ తరగతి, డిప్లొమా, ఐటీఐ, పాలిటెక్నిక్, యూజీ, పీజీ కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులు అర్హులు. అర్హులైన విద్యార్థులు సెప్టెంబర్ 4 వరకు అప్లై చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

ప్రోగ్రామ్ వివరాలు:

  • హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ పరివర్తన్స్ ఎడ్యుకేషనల్ క్రైసిస్ స్కాలర్ షిప్ సపోర్ట్ ప్రోగ్రామ్ 2024-2025.

అర్హత:

  • 1-12వ తరగతి, డిప్లొమా, ఐటీఐ, పాలిటెక్నిక్, యూజీ, పీజీ కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులు అర్హులు. కుటుంబ వార్షిక ఆదాయం 2.5 లక్షల కంటే తక్కువగా ఉండాలి. గత మూడు సంవత్సరాలలో కుటుంబ సంక్షోభాలను అనుభవించిన వారికి ప్రాధాన్యత ఉంటుంది. దరఖాస్తు దారులు మునుపటి అర్హత పరీక్షలో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.

స్కాలర్ షిప్ వివరాలు:

  • 1-6 తరగతుల వారికి రూ. 15 వేలు. 7-12 తరగతి, డిప్లొమా, ఐటీఐ, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ. 18 వేలు అందిస్తారు. జనరల్ డిగ్రీ కోర్సులకు రూ. 30 వేలు. ప్రొఫెషనల్ డిగ్రీ కోర్సులకు రూ. 50 వేలు. జనరల్ పీజీ కోర్సులకు రూ. 35 వేలు. ప్రొఫెషనల్ పీజీ కోర్సులకు రూ. 75 వేలు.

కావాల్సిన పత్రాలు:

  • పాస్ పోర్ట్ సైజ్ ఫొటో
  • గత సంవత్సరం మార్క్ షీట్(2023-24)
  • ప్రస్తుత సంవత్సరం అడ్మిషన్ ప్రూఫ్
  • దరఖాస్తుదారు బ్యాంక్ పాస్ బుక్
  • ఇన్ కం సర్టిఫికేట్

దరఖాస్తు విధానం:

  • ఆన్ లైన్

ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేదీ:

  • 04-09-2024

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş