iDreamPost
android-app
ios-app

మంచం కింద బాంబు.. సినిమాని తలపిస్తున్న VRA హత్య!

  • Published Sep 30, 2024 | 1:06 PM Updated Updated Sep 30, 2024 | 1:06 PM

Andhra Pradesh: కడప జిల్లాలో సినిమా లెవెల్ హత్య వెలుగులోకి వచ్చింది. ఈ హత్య గురించి తెలిస్తే దేవుడా అంటారు. దారుణమైన హత్య ఇది.

Andhra Pradesh: కడప జిల్లాలో సినిమా లెవెల్ హత్య వెలుగులోకి వచ్చింది. ఈ హత్య గురించి తెలిస్తే దేవుడా అంటారు. దారుణమైన హత్య ఇది.

మంచం కింద బాంబు.. సినిమాని తలపిస్తున్న VRA హత్య!

కడప జిల్లాలో సినిమా లెవెల్లో హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ హత్య గురించి తెలిస్తే కచ్చితంగా దేవుడా అంటారు. అంత దారుణమైన హత్య ఇది. ఏకంగా మంచం కింద బాంబు పెట్టి మరి వీఆర్‌ఏను ఘోరంగా హత్య చేశారు. ఈ ఘటన ప్రస్తుతం కడప జిల్లాలో సంచలనం సృష్టిస్తుంది. ఈ ఘటనలో వీఆర్‌ఏ, అతని భార్య ఉన్నారు. వీఆర్ఏ స్పాట్ లోనే మృతి చెందగా ఆయన భార్యకి మాత్రం చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

కడప జిల్లాలోని వేముల మండలంలో కొత్తపల్లిలో ఉంటున్నారు మృతుడు నరసింహ. ఆయన వీఆర్ఏగా పని చేసేవారు. ఆయనని దారుణంగా జిలెటిన్ స్టిక్స్‌ డిటోనేటర్లతో హత్య చేశారు. నరసింహ ఇంట్లో నిద్రపోతుండగా.. బాబు అనే వ్యక్తి వచ్చాడు. అతని మంచం కింద డిటోనేటర్లు పెట్టి పేల్చేశాడు. దీంతో నరసింహ స్పాట్‌లోనే చనిపోయారు. ఆయన భార్య మాత్రం తీవ్ర గాయాలతో ప్రమాదం నుంచి తప్పించుకుంది. దాంతో స్థానికులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. బాంబు పేలిన ప్రదేశాన్ని పరిశీలించారు. తరువాత కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. అసలు నిందితుడు బాబు ఎందుకు ఇంత దారుణంగా నరసింహాని హత్య చేశాడనే విషయంలోకి వెళితే.. షాకింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు ప్రధాన కారణం వివాహేతర సంబంధం. ఈ విషయంలో ఆ పాతకక్షలే కారణమని పోలీసుల విచారణలో తెలిసింది. బాబుని అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నించగా ఈ విషయం తెలిసింది. ఈ ఘటనలో నరసింహ ఇల్లు ధ్వంసమైంది.

నరసింహకు కూతురు పుష్పావతి ఉంది. కన్న తండ్రి చనిపోవడంతో కన్నీరు మున్నీరవుతుంది. నిందితుడు బాబుపై సంచలన విషయాలు బయట పెట్టింది. తన తల్లీ.. బాబుతో మాట్లాడలేదన్న కోపంతోనే తన నాన్నను చంపాడని వాపోయింది. బాబు కుటుంబానికి.. తమ కుటుంబానికి మధ్య గతంలో చాలా గొడవలు జరిగాయని తెలిపింది. రాత్రి తన తల్లిదండ్రులు నిద్రపోతున్న సమయంలో కరెంటు తీసి.. జిలెటిన్ స్టిక్స్‌ పెట్టి మరి చంపాడని పుష్పావతి ఆరోపించింది. మృతుడి కుటుంబ సభ్యులు కూడా గతంలో వీరి మధ్య గొడవలు జరిగాయని తెలిపారు. గత రెండు నెలల క్రితం బాబు నరసింహతో గొడవ పడ్డాడని తెలిపారు. ఇక అప్పటి నుంచి బాబు నరసింహాపై కక్ష పెంచుకున్నాడట. దాంతో ఈ హత్యకి పాల్పడ్డాడని కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా.. ఈ దారుణమైన ఘటన ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లో సంచలనంగా మారింది. ఈ ఘటనపై మీరేమి అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.