iDreamPost
android-app
ios-app

అందమైన భార్య.. ఆ ఒక్క పనిచేయలేదని భర్త దారుణం!

  • Published Jul 19, 2024 | 12:30 PMUpdated Jul 19, 2024 | 12:30 PM

Yadgir District Crime News: ఆ ఇద్దరూ ప్రేమించుకున్నారు.. పెద్దలను ఒప్పటించి పెళ్లి చేసుకున్నారు. హ్యాపీగా సాగిపోతున్న వారి కాపురంలో ఉన్నట్టుండి సమస్యలు వచ్చాయి.. చిలికి చిలికి గాలివానగా మారాయి.

Yadgir District Crime News: ఆ ఇద్దరూ ప్రేమించుకున్నారు.. పెద్దలను ఒప్పటించి పెళ్లి చేసుకున్నారు. హ్యాపీగా సాగిపోతున్న వారి కాపురంలో ఉన్నట్టుండి సమస్యలు వచ్చాయి.. చిలికి చిలికి గాలివానగా మారాయి.

  • Published Jul 19, 2024 | 12:30 PMUpdated Jul 19, 2024 | 12:30 PM
అందమైన భార్య.. ఆ ఒక్క పనిచేయలేదని భర్త దారుణం!

ఇటీవల పెద్దలు తెచ్చిన సంబంధాలు కాకుండా యువత తమకు నచ్చిన వారిని పెళ్లి చేసుకుంటున్నారు. ఇద్దరూ ఇష్టపడి కొంత కాలం స్నేహంగా ఉంటూ.. రిలేషన్ షిప్ మెయింటేన్ చేసి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటున్నారు. కొన్నిసార్లు  రిలేషన్ షిప్ లో విభేదాలు వస్తే విడిపోతున్నారు. ఇటీవల సోషల్ మాధ్యమాల ద్వారా ప్రేమ వ్యవహారాలు నడుస్తున్న విషయం తెలిసిందే.  ఫేస్ బుక్ ద్వారా ఇద్దరూ పరిచయం అయ్యారు.. ఆ పరిచయం ప్రేమగా మారింది. కొంతకాలం ప్రేమించుకున్న ఆ జంట పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు ఒక ఏడాది బిడ్డ. అంతా హ్యాపీగా సాగిపోతుందనుకుంటున్న సమయంలో దారుణం చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

కర్ణాటక రాష్ట్రం యాదగిరి జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఉన్మాదిగా మారిన భర్త తన భార్య, అత్త, ఓ వ్యక్తిని రాడ్డుతో కొట్టి చంపిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన యాదగిరి తాలూకా సైదాపూర్ లో చోటు చేసుకుంది. యాదగిరి తాలూకా మునగల్ గ్రామానికి చెందిన నవీన్, అన్నపూర్ణ ఫేస్ బుక్ ద్వారా పరిచయం ఏర్పడి తర్వాత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.ఈ దంపతులకు ఏడాది బిడ్డ. కొంత కాలంగా నవీన్ లో వరకట్న దురాశ మొదలైంది. అన్నపూర్ణనను తల్లిగారింటికి వెళ్లి కట్నం తీసుకురావాలని బలవంతం చేయడం మొదలు పెట్టాడు. తమ తల్లిదండ్రులు ఇప్పటికే ఎంతో సాయం చేశారని.. ఇప్పుడు కట్నం తీసుకురమ్మని అడగలేనని అన్నపూర్ణ చెప్పింది. ఇలా కొద్దిరోజులగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి.

భర్తతో గొడవలు భరించలేక అన్నపూర్ణ బాబును తీసుకొని పుట్టింటికి వెళ్లిపోయింది. ఏడాది కాలంలో పుట్టింటిలోనే ఉంటుంది. పలుమార్లు నవీన్ అత్తగారింటికి వెళ్లి పిలిచినా రాలేదు. దీంతో తన భార్య, అత్త కుటుంబంపై కక్ష్య పెంచుకున్నాడు. సమయం చూసి రాడ్డుతో అన్నపూర్ణ (25), కవిత (45), బసవరాజప్ప(52) లను అతి దారుణంగా హ్యతచేసి చంపాడు. మృతదేహాలను జోలదాగి గ్రామ సమీపంలో పడేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. క్షణికావేశంలో భర్త చేసిన పనికి తల్లికి దూరమైన చిన్నారిని చూసి గ్రామస్థులు కంటతడి పెట్టుకున్నారు. నింధితుడికి కఠిన శిక్ష పడాలని డిమాండ్ చేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి