iDreamPost
android-app
ios-app

దారుణం.. కమ్మలు కొనివ్వలేదని భర్తకు నిప్పుపెట్టిన భార్య!

  • Published Mar 18, 2024 | 8:30 PM Updated Updated Mar 18, 2024 | 8:30 PM

ఈ మధ్య కాంలలో చాలా మంది ప్రతి చిన్న విషయాలకు క్షణికావేశానికి గురై దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు.

ఈ మధ్య కాంలలో చాలా మంది ప్రతి చిన్న విషయాలకు క్షణికావేశానికి గురై దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు.

దారుణం.. కమ్మలు కొనివ్వలేదని భర్తకు నిప్పుపెట్టిన భార్య!

ఈ మధ్య కాలంలో చాలా మంది చిన్న చిన్న విషయాలకే మనస్థాపానికి గురై సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆ క్షణంలో తాము ఏం చేస్తున్నామో తెలియని స్థితిలో ఎన్నో దారుణాలకు తెగబడుతున్నారు. ఆర్థిక ఇబ్బందులు, పని ఒత్తిడి, ప్రేమ వ్యవహారాలు, అక్రమ సంబంధాల కారణంగా సమస్యలు తలెత్తి మనస్థాపానికి గురై దారుణమై నిర్ణయాలు తీసుకుంటున్నారు. క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ఎన్నో జీవితాలు నాశనం అవుతున్నాయి. సాధారణంగా మహిళలకు బంగారం అంటే ఎంతో ఇష్టం.  ఓ మహిళ బంగారంపై మోజుతో దారుణానికి తెగబడింది. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

భారత దేశంలో వివాహబంధానికి ఎంతో విలువ ఇస్తుంటారు. వారి వారి మతాచారాల ప్రకారం పెళ్లైన తర్వాత భార్యాభర్తలు చల్లగా ఉండాలని దివిస్తుంటారు పెద్దలు. ఈ మధ్య భార్యాభర్తల బంధానికి మచ్చతెచ్చే విధంగా ఎన్నో దారుణ సంఘనలు జరుగుతున్నాయి. తాజాగా ఖమ్మం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తనకు బంగారు దిద్దులు కొనివ్వలేదని భార్య భర్తకు ఏకంగా నిప్పంటించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లాకు చెందిన సమీనాను ఖమ్మం నగరం నిజాంపేటకు చెందిన యాకూబ్ పాషా వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు. యాకూబ్ పాషా దినసరి కూలిగా పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. పాషా తల్లి అతని వద్ద ఉంటూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటుంది. ఈ క్రమంలోనే కొంత కాలంగా యాకూబ్ భార్య సమీనా తన అత్తతో గొడవ పడుతూ వచ్చింది. ఆమెను తమతో ఉంచుకోవడానికి వీల్లేదని చెప్పడంతో తల్లికి వేరే ఇల్లు చూసి పంపించాడు. ఈ సమస్య పోయి యాకూబ్ కి కొత్త సమస్య మొదలైంది.

తనకు చెవి దిద్దులు కొనివ్వాలంటూ భర్తపై సమీనా కొద్ది రోజులుగా ఒత్తిడి తీసుకువస్తుంది. ప్రస్తుతం తన పరిస్థితి బాగాలేదు.. తర్వాత కొనిపిస్తా అని చెబుతూ వచ్చాడు పాష. ఇలా ప్రతిరోజూ పాషాని అలాగే వేధిస్తూ వస్తుంది. రెండు రోజుల క్రితం పని ముగించుకొని ఇంటికి వచ్చిన యాకూబ్ ని మళ్లీ తనకు దిద్దులు కావాలని పట్టుబట్టింది. దీంతో యాకూబ్ కి కోపం వచ్చి నా వల్ల కాదు అని చెప్పాడు.. దీంతో క్షణికావేశానికి గురైన అమీనా పక్కనే ఉన్న ఆయిల్ అతనిపై పోసి లైటర్ తో నిప్పంటించింది. దీంతో కాలిపోతున్న యాకూబ్ బయటకు పరెగెత్తాడు. స్థానికులు అతని మంటలు ఆర్పేలోపు 40 శాతం శరీర భాగాలు కాలిపోయాయి. యాకూబ్ తల్లి ఫిర్యాదు ప్రకారం సోమవారం ఖమ్మం నగర పోలీసులు పాషా భార్య సమీనాపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఖమ్మం ఆస్పత్రిలో యాకూబ్ చావుతో పోరాడుతున్నాడు.