iDreamPost
android-app
ios-app

ఇంత దారుణం ఎలా చేయగలిగావ్‌ తల్లి.. కన్న ప్రేమ గుర్తుకు రాలేదా?

  • Published Jul 25, 2023 | 11:10 AMUpdated Jul 25, 2023 | 12:00 PM
  • Published Jul 25, 2023 | 11:10 AMUpdated Jul 25, 2023 | 12:00 PM
ఇంత దారుణం ఎలా చేయగలిగావ్‌ తల్లి.. కన్న ప్రేమ గుర్తుకు రాలేదా?

పిల్లలు దేవుడు చల్లని వారే.. కల్లకపటమెరుగని కరుణామయులే అనే మాట అక్షర సత్యం. లోకం పోకడ తెలియని ఆ పసి వయసులో కేవలం అమాయకత్వం మాత్రమే ఉంటుంది. బోసి నోటితో చిరునవ్వులు చిందించే ఆ పసి ముఖాలను చూస్తే.. ఎంతటి టెన్షన్‌ అయినా చేత్తో తీసేసినట్లుగా మాయమవుతంది. కల్మషం అంటని ఆ పసి మనసులు ఎవరినైనా ఇట్టే తమ వైపు ఆకర్షించుకుంటాయి. ముద్దులోలికే చిన్నారులను చూస్తే.. దగ్గరకు తీసుకుని వారితో కలిసి సరదాగా ఆడుకోవాలని అనిపిస్తుంది. కానీ కొందరు కసాయి వాళ్లకు మాత్రం పసి మొగ్గలను చిందేసే కౄరమైన ఆలోచనలు ఎలా వస్తాయో అర్థం కాదు. అందునా కడుపు చించుకుని.. బిడ్డకు జన్మనిచ్చిన తల్లి ఇంతటి దారుణాలకు ఎలా పాల్పడగలుతుందో ఏమో. తాజాగా ఈ కోవకు చెందిన దారుణం ఒకటి వెలుగు చూసింది. ఏడేళ్ల చిన్నారిని దారుణంగా హత్య చేసి.. తాము ఆత్మహత్య చేసుకున్నారు ఓ దంపతులు. ఇంతకు ఏం జరిగింది అంటే..

ఈ విషాదకర సంఘటన తమిళనాడు, కన్యాకుమారిలో చోటు చేసుకుంది. మృతి చెందని దంపతలు పేరుల మరళీధరన్‌, శైలజ. వీరికి ముద్దులోలికే చిన్నారి జీవి ఉన్నాడు. ఏడేళ్ల బిడ్డ భవిష్యత్తు గురించి మురళీధరన్‌ దంపతులు ఎన్నో కలలు కన్నారు. ఇద్దరు ఐటీ ఉద్యోగం చేస్తుండటంతో ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేవు. పైగా ఈ మధ్య కాలంలో.. అన్ని హంగులతో సర్వంగాసుందర​ంగా ఇంటిని నిర్మించుకున్నారు. వారిని చూస్తే ఎవ్వరికైన ముచ్చటైన కుటుంబం అనిపించక మానదు. బిడ్డ మీదే ప్రాణం పెట్టుకున్న ఆ దంపతులు.. కల్లో కూడా ఊహించని దారుణానికి ఒడిగట్టారు. తల్లిదండ్రులు అంటే బిడ్డలను కాపాడే రక్షణ కవచం. కానీ జీవా విషయంలో మాత్రం వారే ఆ చిన్నారి పాలిటి మృత్యువు. స్వయంగా తమ చేతులతోనే కన్న బిడ్డను కడతేర్చారు.

రాత్రి పడుకునే ముందు పాలలో నిద్ర మాత్రలు కలిపి కొడుకు చేత తాగించారు. అనంతరం జీవా స్పృహ కోల్పోయిన తర్వాత.. అతడి ముఖంపై దిండు అదిమి పెట్టి.. ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. ఆ తర్వాత తాము కూడా ఆత్మహత్య చేసుకున్నారు. అమాయకమైన ముఖంతో.. వచ్చి రాని మాటలతో.. క్యూట్‌గా ఉండే జీవాను చూస్తే.. బయటి వాళ్లకే ఏం అనాలనిపించదు. అలాంటిది బాబు కన్నతల్లిదండ్రులైన మురళీధరన్‌ దంపతులు ఇలాంటి దారుణానికి ఎలా పాల్పడ్డారో ఎవరికి అర్థం కావడం లేదు. సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఇక దర్యాప్తులో షాకింగ్‌ విషయం వెలుగు చూసింది.

మురళీధరన్ కొడుకు జీవాకి అనారోగ్య సమస్య ఉందన్న విషయం పోలీసులు దర్యాప్తులో వెల్లడయ్యింది. బాబు సమస్యను పరిష్కరించడం కోసం.. అతడిని పూర్తి ఆరోగ్యవంతుడిగా మార్చుకోవడం కోసం మురళీధరన్‌ దంపతలు ఎందరో వైద్యులను కలిశారు. జీవాను పరిశీలించిన డాక్టర్లు.. చిన్నారి మానసిక స్థితి జీవితాంతం ఇలానే ఉంటుందని తెలిపారు. బిడ్డ భవిష్యత్తు గురించి గొప్ప గొప్ప కలలు కన్న ఆ దంపతులు ఈ దారుణ నిజాన్ని జీర్ణం చేసుకోలేకపోయారు.

దాంతో గుండెని రాయి చేసుకుని.. స్వయంగా తమ చేతులతోనే కన్న బిడ్డను హతమర్చారు. ఆ తర్వాత తాము కూడా ఆత్మహత్య చేసుకుని.. తనువు చాలించారు. మురళీధరన్‌ దంపతులు చేసిన పనికి స్థానికులు షాక్‌కు గురయ్యారు. జీవితం అంటే కష్టాలు తప్పవు.. కానీ ఇలా కుంగిపోయి.. తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల లాభం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి