iDreamPost
android-app
ios-app

HYDలో దారుణం.. భార్యను చంపి పిల్లలతో పరారైన భర్త!

HYDలో దారుణం.. భార్యను చంపి పిల్లలతో పరారైన భర్త!

హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. ఓ భర్త తన భార్యను హత్య చేసి ఆ తర్వాత తన పిల్లలను తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. స్థానికులు అప్రమత్తమై వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ వివాహిత మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లోని ఓ ప్రాంతంలో నర్సింహ-సుధారాణి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి గతంలో వివాహం జరిగింది. ఇక పెళ్లైన కొంత కాలానికి వీరికి ఇద్దరు పిల్లలు జన్మించారు. భర్త స్థానికంగా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అలా కొన్నాళ్ల పాటు వీరి సంసారం సజావుగానే సాగింది. ఇదిలా ఉంటే.. భర్త నర్సింహ గత కొంత కాలం నుంచి అదనపు కట్నం కోసం భార్యను వేధించినట్లు తెలుస్తోంది. ఇదే విషయమై నర్సింహ భార్యతో తరుచు గొడవ పడేవాడని సమాచారం.

ఇకపోతే.. ఇదే అంశంపై తాజాగా ఈ దంపతులు మరోసారి గొడవ పడ్డారు. ఈ క్రమంలోనే కోపంతో ఊగిపోయిన భర్త నర్సింహ.. దిండుతో భార్యను నొక్కిపట్టి ఊపిరాడకుండ చేసి హత్య చేసినట్లు తెలుస్తుంది. అనంతరం నర్సింహ తన పిల్లలను తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికులు అప్రమత్తమై వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.

ఇది కూడా చదవండి: వీడియో: బైక్ ను ఢీకొని.. కాలువలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు!

Jojobet GirişmeritbetmeritbetmeritkingPradabet güncel girişcasibomJojobet GirişjojobetjojobetjojobetcasibommeritkingMadridbetPokerklasJojobet GirişjojobetHoliganbet GirişOnwin Giriş