Karnataka Crime News: మొదట్లో ప్రేమ, ఆ తర్వాత సహజీవనం.. ఆ రోజు రాత్రి..!

మొదట్లో ప్రేమ, ఆ తర్వాత సహజీవనం.. ఆ రోజు రాత్రి..!

చూడటానికి అందంగా, నవ్వుతూ కనిపిస్తున్న ఈ యువతి పేరు ఆకాంక్ష. వయసులో కూడా చాలా చిన్నదే. అయితే, ఉన్నత చదువులు పూర్తి చేసిన ఈ అమ్మాయి.. ఉద్యోగం కోసం బెంగుళూరులోని ఓ కంపెనీలో చేరింది. అక్కడే కొన్నాళ్ల పాటు పని చేసింది. ఈ క్రమంలోనే ఈ యువతికి అదే కంపెనీలో పని చేస్తున్న ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇక అప్పటి నుంచి ఇద్దరూ ఎంతో సన్నిహితంగా మెలిగి ఆ తర్వాత సహజీవనం కూడా చేశారు. కట్ చేస్తే.. ఓ రోజు రాత్రి ఏం జరిగిందంటే?

పోలీసులు కథనం ప్రకారం.. హైదరాబాద్ కు చెందిన ఆకాంక్ష (23) ఉన్నత చదువులు పూర్తి చేసి బెంగుళూరులోని ఓ మార్కెటింగ్ కంపెనీలో ఉద్యోగానికి కుదిరింది. ఇక ఆ యువతి రోజూ ఆఫీసుకి వెళ్తూ అక్కడే ఓ ఫ్లాట్ లో ఉండేది. అయితే, ఈ క్రమంలోనే అదే కంపెనీలో పని చేస్తున్న ఢిల్లీకి చెందిన అర్పిత్ (25) అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త ఇద్దరి ప్రేమగా మారింది. దీంతో ఇద్దరూ అప్పటి నుంచి సినిమాలు, షికారులు అంటూ తెగ తిరిగారు. కాగా, అప్పటి నుంచి ఈ ప్రేమికులు సహజీవనం చేసినట్లు కూడా తెలుస్తుంది.

అయితే ఉన్నట్టుండి వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి చేరాయి. దీంతో ఇద్దరూ విడిపోవాలని అనుకున్నారు. ఇకపోతే, గత నెలలో అర్పిత్ బెంగుళూరు నుంచి హైదరాబాద్ కు వెళ్లాడు. ఆ తర్వాత జూన్ 5వ తేదీన తిరిగి బెంగుళూరు వెళ్లాడు. ఆ రోజు రాత్రి ఆకాంక్ష ఫ్లాట్ కు వెళ్లాడు. ఇద్దరు కలిసి కొద్దిసేపు మాట్లాడుకున్నారు. ఇదే సమయంలో ఆకాంక్ష మరో యువకుడితో మాట్లాడుతున్నట్లు అర్పిత్ గమనించాడు. ఇక కోపంతో ఊగిపోయిన అర్పిత్.. ఆ యువతిని గొంతు పిసికి హత్య చేశాడు.

ఆమె శవాన్ని రూమ్ లోనే ఉంచి అక్కడి నుంచి పరారయ్యాడు. కాగా, సాయంత్రం మృతురాలి ఫ్రెండ్ రూమ్ లోకి వచ్చి చూడగా.. ఆకాంక్ష శవమై కనిపించింది. షాకైన ఆ యువతి వెంటనే జీవన భీమనగర పోలీసులకు సమాచారం అందించింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువతి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని హత్యగా తేల్చారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న అర్పిత్ ను ఎట్టకేలకు మంగళవారం అరెస్ట్ చేశారు.

Show comments