iDreamPost

పని మనిషి బిందుశ్రీ ఇలా చేసిందేంటి? రాత్రి పూట మేడపైకి వెళ్లి..!

పని మనిషి బిందుశ్రీ ఇలా చేసిందేంటి? రాత్రి పూట మేడపైకి వెళ్లి..!

పైన ఫొటోలో కనిపిస్తున్నయువతి పేరు బిందు శ్రీ. వయసు 28 ఏళ్లు. ఈ అమ్మాయి హైదరాబాద్ లో ఓ ప్రాంతంలో ఉంటూ ఓ అపార్ట్ మెంట్ లో  పని మనిషిగా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంది. ఇలా చాలా కాలం పాటు ఈ యువతి అక్కడే పని చేస్తూ ఎంతో నమ్మకంగా మెలిగింది. ఇదిలా ఉంటే.. ఇటీవల తెల్లవారు జామున ఈ యువతి ఫోన్ మాట్లాడుకుంటూ అపార్ట్ మెంట్ పై అంతస్తుకు వెళ్లినట్లు తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో కానీ ఉన్నట్టుండి ఊహించని ఘటన చోటు చేసుకుంది. దీంతో ఆ యువతి తల్లిదండ్రులతో పాటు అందరూ షాక్ గురవుతున్నారు. అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. కాకినాడ జగ్గంపేటకు చెందిన బిందుశ్రీ (28) అనే యువతి కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ బంజారాహిల్స్ లోని షాకత్ నగర్ లో నివాసం ఉంటుంది. అయితే ఈ అమ్మాాయి గత కొన్ని రోజులుగా మణికొండలోని ఓ అపార్ట్ మెంట్ లోని ఉన్న ఓ వ్యక్తి ఇంట్లో పని మనిషిగా చేరింది. అక్కడే చాలా కాలంగా పని చేస్తుంది. ఇదిలా ఉంటే.. శనివారం తెల్లవారు జామున ఆ యువతి ఫోన్ లో మాట్లాడుకుంటూ 21వ అంతస్తు వరకు ఎక్కింది. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ.. ఆ యువతి ఉన్నట్టుండి అక్కడి నుంచి కిందకు దూకినట్లు తెలుస్తోంది.

దీంతో ఆ యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ విషయం తెలుసుకున్న మృతురాలి కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా ఏడ్చారు. అనంతరం ఈ ఘటన విషయం పోలీసులకు దృష్టికి వెళ్లడంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ తర్వాత ఆ యువతి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఉన్నట్టుండి బిందుశ్రీ చనిపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.

ఇది కూడా చదవండి: మూడు కుటుంబాల్లో విషాదం నింపిన ట్రయాంగిల్ లవ్ స్టోరీ! అసలేం జరిగిందంటే?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి