ఐస్ సదన్ యువతి హత్య కేసులో కీలక మలుపు!

ఐస్ సదన్ యువతి హత్య కేసులో కీలక మలుపు!

శనివారం స్వప్న అనే యువతి హత్యకు గురైన విషయం తెలిసిందే. ముందుగా ఈ కేసులో ఆమె ప్రియుడు హనుమంతే హత్య చేసి ఉంటాడని భావించారు. అయితే ఈ కేసు ఇప్పుడు ఊహించని మలుపుకు తిరిగింది. అసలేం జరిగిందంటే?

శనివారం స్వప్న అనే యువతి హత్యకు గురైన విషయం తెలిసిందే. ముందుగా ఈ కేసులో ఆమె ప్రియుడు హనుమంతే హత్య చేసి ఉంటాడని భావించారు. అయితే ఈ కేసు ఇప్పుడు ఊహించని మలుపుకు తిరిగింది. అసలేం జరిగిందంటే?

హైదరాబాద్ లోని ఐస్ సదన్ లో స్వప్న అనే యువతి హత్యకు గురైన విషయం తెలిసిందే. ముందుగా ఈ అమ్మాయిని ఆమెతో పాటే ఉంటున్న ఓ యువకుడు హత్య చేసి ఆ తర్వాత ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని వార్తలు వచ్చాయి. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని యువతి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత ఆ యువకుడిని ఆస్పత్రికి తరలించారు. ఈ కేసు ఇప్పుడు కీలక మలుపు తిరిగింది. అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. హత్యకు గురైన స్వప్న అనే యువతి హనుమంతు అనే ఇద్దరు నెల కిందట ప్రేమించి పెళ్లి చేసుకున్నారట. ఆ తర్వాత అప్పటి నుంచి కుటుంబానికి దూరంగా ఉంటూ చంపాపేట్ రాజీరెడ్డి నగర్ లోని ఓ ఇంట్లో అద్దెకు ఉన్నారు. అయితే స్వప్న హత్యకు ముందే వీరుంటున్న ఇంట్లో ఇద్దరు వ్యక్తులు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హత్య అనంతరం హనుమంతును బిల్డింగ్ లోని రెండవ అంతస్తు నుంచి తోసేసి వారు అక్కడి నుంచి పరారైనట్లు తెలుస్తుంది. ఇక తీవ్రంగా గాయపడిన హనుమంతును పోలీసులు ఆస్పత్రిలో చేర్పించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో భాగంగానే వీరిద్దరి ఫోన్ కాల్ డేటాను సైతం పోలీసులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇంతే కాకుండా పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా సంచలంగా మారుతోంది.

Show comments