ప్రాణ స్నేహితుడి కూతురిని గర్భవతిని చేసిన ప్రభుత్వ అధికారి!

ప్రాణ స్నేహితుడి కూతురిని గర్భవతిని చేసిన ప్రభుత్వ అధికారి!

దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణం వెలుగు చూసింది. మైనర్ బాలికపై ఓ ప్రభుత్వ అధికారి అత్యాచారానికి ఒడిగట్టాడు. ఇలా చాలా సార్లు అఘాయిత్యానికి పాల్పడడంతో ఆ బాలిక గర్భం దాల్చింది. ఆ అమ్మాయి చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అనంతరం బాధిత బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఇదే అంశం ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారుతోంది.

పోలీసుల కథనం ప్రకారం.. ప్రేమోదరు ఖాఖా అనే వ్యక్తి ఢిల్లీ మహిళా, శిశు అభివృద్ధి శాఖలో డిప్యూటీ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. అయితే ఇతనికి ఓ స్నేహితుడు ఉండేవాడు. అతడు 2020లో మరణించాడు. దీంతో అప్పటి నుంచి అతని కూతురుని ప్రభుత్వ అధికారి అయిన ప్రేమోదరు ఖాఖా ఆ బాలిక యోగ క్షేమాలు చూసుకుంటూ ఉన్నాడు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. ఈ దుర్మార్గుడు ఆ మైనర్ బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఆ బాలికను బలంతం చేస్తూ అనేక సార్లు అత్యాచారానికి ఒడిగట్టాడు. దీంతో ఆ బాలిక గర్భం దాల్చింది. ఈ విషయం తెలుసుకున్న ప్రేమోదరు భార్య ఆ బాలికకు గర్భనిరోదక మందులు వేసింది.

ఇక అప్పటి నుంచి ఆ బాలిక ఆరోగ్యం పూర్తిగా క్షీణిస్తూ వచ్చింది. అయితే ఇటీవల ఆ బాలికను ఆమె తల్లి ఆస్పత్రికి తరలించింది. ఈ క్రమంలోనే ఈ అమ్మాయి తనపై జరిగిన దారుణాన్ని వైద్యులకు పూసగుచ్చినట్లుగా వివరించింది. దీంతో షాక్ గురైన ఆ వైద్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు. ఇతనికి సహకరించిన అతని భార్యను సైతం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన సంచలనంగా మారుతోంది. స్నేహితుడి కూతురిని గర్భవతిని చేసిన ఈ దుర్మార్గుడి దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

ఇది కూడా చదవండి: వారంలో పెళ్లి అనగా.. ఎవ్వరూ ఊహించని ట్విస్ట్ ఇచ్చిన యువతి!

Show comments