iDreamPost
android-app
ios-app

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇక కౌంటర్‌కు వెళ్లకుండానే ఎప్పుడైనా టికెట్

  • Published Apr 16, 2024 | 4:12 PM Updated Updated Apr 16, 2024 | 5:26 PM

సాధారణంగా ఏదైనా దూర ప్రాంతాలకు ప్రయాణించాలని అనుకున్నప్పుడు చాలామంది ముందుగానే ట్రైన్ లో బెర్త్ ని బుక్ చేసుకోవాలనుకుంటారు. అందుకోసం రైల్వే స్టేషన్ లో టికెట్ కౌంటర్ వద్ద టికెట్స్ కోసం క్యూలో అనేక ఇబ్బందులను ఎదుర్కొవలసి వస్తుంది. ఇక ఈ సమస్యలపై దృష్టి పెట్టి వాటికి చెక్ పెట్టేందుకు తాజాగా రైల్వే శాఖ ప్రయాణికులకు ఓ గుడ్ న్యూస్ అందించింది. ఇంతకి అదేమిటంటే..

సాధారణంగా ఏదైనా దూర ప్రాంతాలకు ప్రయాణించాలని అనుకున్నప్పుడు చాలామంది ముందుగానే ట్రైన్ లో బెర్త్ ని బుక్ చేసుకోవాలనుకుంటారు. అందుకోసం రైల్వే స్టేషన్ లో టికెట్ కౌంటర్ వద్ద టికెట్స్ కోసం క్యూలో అనేక ఇబ్బందులను ఎదుర్కొవలసి వస్తుంది. ఇక ఈ సమస్యలపై దృష్టి పెట్టి వాటికి చెక్ పెట్టేందుకు తాజాగా రైల్వే శాఖ ప్రయాణికులకు ఓ గుడ్ న్యూస్ అందించింది. ఇంతకి అదేమిటంటే..

  • Published Apr 16, 2024 | 4:12 PMUpdated Apr 16, 2024 | 5:26 PM
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇక కౌంటర్‌కు వెళ్లకుండానే ఎప్పుడైనా టికెట్

చాలామంది ప్రయాణలు చేసేందుకు బస్సులు,కార్లు ఇలా ఎన్ని ఉన్నప్పటికి సౌకర్యవంతమైన ప్రయాణం కోసం..ఎక్కువ శాతం రైలు జర్నీలనే ఇష్టపడుతుంటారు. ఎందుకంటే.. దూర ప్రాంతాలకు వెళ్లాలనుకునే వారు కుటుంబంతో సరదాగా ట్రైన్ లో ప్రయాణం చేయాలని ఆసక్తి చూపుతారు. పైగా ఈ రైళ్లు ప్రయాణం అనేది సౌకర్యవంతగా, సురక్షితంగా ఉంటుంది. కనుక ఏదైనా వెకేషన్ కోసం రైలు ప్రయాణం చేయాలనుకునే వారు.. ముందుగానే టికెట్స్ బుక్ చేసుకోవాల్సి వస్తుంది. అయితే కొన్ని సందర్భల్లో మాత్రం అప్పటికప్పుడు ప్రయాణం చేయావలసి వస్తుంది. అప్పుడు టికెట్ కౌంటర్ వద్దకు వెళ్లి లైన్ లో నిల్చొని టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఆ టికెట్ కౌంటర్ వద్ద చూస్తే ప్రయాణికుల రద్దీ భారీగా ఉంటుంది. దీంతో టికెట్ తీసుకోవడంలో చాలా ఇబ్బందులు ఎదురవుతుంటాయి. కొన్ని సార్లు సమయానికి టికెట్ దొరకక.. వెళ్లవలసిన ప్రయాణం అగిపోవడం వంటివి జరుగుతుంటాయి. అయితే ఈ ఇబ్బందులన్నీ దృష్టిలో పెట్టుకొని వాటిని చెక్ పెట్టేందుకు తాజాగా రైల్వే శాఖ ప్రయాణికులకు ఓ గుడ్ న్యూస్ అందించింది. ఇంతకి అదేమిటంటే..

సాధారణంగా ఏదైనా దూర ప్రాంతాలకు ప్రయాణించాలని అనుకున్నప్పుడు చాలామంది ముందుగానే ట్రైన్ లో బెర్త్ ని బుక్ చేసుకోవాలనుకుంటారు. అందుకోసం చాలా రోజుల ముందుగానే టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే కొన్ని సందర్భల్లో మాత్రం అప్పటికప్పుడు సడెన్ గా ప్రయాణించాల్సి వస్తుంది. అప్పుటు రైల్వే స్టేషన్ లో టికెట్ కౌంటర్ వద్ద టికెట్స్ కోసం క్యూలో అనేక ఇబ్బందులను ఎదుర్కొవలసి వస్తుంది. ఇక ఈ సమస్యలపై దృష్టి పెట్టిన రైల్వే సంస్థ వాటికి చెక్ పెట్టేందుకు.. ఇప్పటికే అందుబాటులో ఉన్న అన్‌రిజర్వ్‌డ్ టికెట్ బుకింగ్ సిస్టమ్ (UTS) యాప్ ను సరికొత్త అప్ డేట్ లతో మళ్లీ లాంఛ్ చేసింది. ఒకప్పుడు తక్కువ దూరం ప్రయాణం, ప్లాట్‌ఫాం టికెట్, క్యూఆర్ బుకింగ్, సీజన్ టికెట్, క్విక్ బుకింగ్ కోసం ఈ యాప్‌ను అందుబాటులోకి తీసుకురాగా.. ఇప్పుడు దీనిలో నాన్- సబర్బన్ ట్రావెల్ టికెట్ బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది.  అనగా.. 200 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ఉన్న ప్రయాణం కోసం 3 రోజుల ముందుగానే ఈ టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఇక 200 కిలోమీటర్ల కంటే తక్కువ దూరం ఉంటే.. ప్రయాణం చేసే రోజే టికెట్ కొనుగోలు చేయాల్సి వస్తుంది.

అయితే ఈ టికెట్ బుకింగ్ ఎలా చేసుకోవాలంటే?

  • యూటీఎస్ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్, యాప్ స్టోర్ నుంచి డౌన్‌లోన్ చేసుకొని అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి.
  • తర్వాత యాప్ లో  లాగిన్ అయ్యాక వెంటనే స్క్రీన్‌ మీద కనిపించే Normal Booking సెక్షన్లోకి వెళ్లాలి. అందులో కనిపించే బుక్ అండ్ ట్రావెల్ (పేపర్ లెస్), బుక్ అండ్ ప్రింట్ (పేపర్).. ఈ రెండు ఆప్షన్లలో దేనినైనా ఒకదానిని ఎంచుకోవాల్సి ఉంటుంది.
  • ఇక పేపర్‌లెస్ ఆప్షన్ ఎంచుకున్నట్లయితే మొబైల్‌లో జీపీఎస్ ఆన్ చేయాలి.
  • ఆ తర్వాత మీరు ప్రయాణం ఎక్కడి నుంచి చేయాలనుకుంటున్నారో ఆ స్టేషన్ తో సహా చేరుకోవాల్సిన స్టేషన్‌ను కూడా ఎంచుకోవాలి.
  • ఆపై కింద కనిపించే ఆప్షన్లతో మీ ప్రయాణానికి అందుబాటులో ఉన్నటువంటి ట్రైన్లు, వాటి ఛార్జీలు మీకు డిస్‌ప్లేపై కనిపిస్తాయి.
  • వెంటనే Get Fare పై క్లిక్ చేసి, మీకు నచ్చిన ట్రైన్‌పై క్లిక్ చేయగానే.. టైమ్, ప్లా్ట్‌ఫాం నంబర్, టికెట్ రేటు, ట్రైన్ నంబర్ వంటి వివరాలన్నీ కనిపిస్తాయి.
  • ఇక ప్యాసింజర్స్ సంఖ్య, ట్రైన్ ట్రిప్ (ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్, సూపర్ ఫాస్ట్), పేమెంట్ టైప్ ఎంచుకోవాల్సి ఉంటుంది.
  • తర్వాత కిందికి స్క్రోల్ చేస్తే..  Book Ticket అని కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేసి, డెబిట్ కార్డు లేదా యూపీఐ/ఇంటర్నెట్ బ్యాంకింగ్/క్రెడిట్ కార్డు దీంట్లో ఏదో ఒక దాన్ని ఎంచుకొని టికెట్ బుక్ చేసుకోవచ్చు.
  • ముఖ్యంగా టికెట్ బుక్ చేసే ముందు పేపర్ మోడ్ ఎంచుకున్నట్లయితే దగ్గర్లోని యూటీఎస్ కియోస్క్ లేదా రైల్వే బుకింగ్ కౌంటర్‌కు వెళ్లి ప్రింట్ తీస్కోవాలి.

ఇక చివరిగా R- వాలెట్‌ను టాపప్ చేయడం అనేది తప్పనిసరేం కాదు. ఒకవేళ చేస్తే వాలెట్ టాప్ అప్‌పై 3 శాతం వరకు బోనస్ లభిస్తుంది. ఈ యాప్‌తో ఒకప్పుడు స్టేషన్‌కు కేవలం 5 కిలోమీటర్ల పరిధిలో ఉన్నప్పుడే టికెట్ బుక్ చేసుకునేందుకు వీలుండేది. అదే ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లో రూ. 10 కిలోమీటర్లకు, ఇతర చోట్ల 20 కి.మీ. కు పెంచారు. అయితే ట్రైన్ ఎక్కిన తర్వాత మాత్రం టికెట్ బుక్ చేసుకోవడం అనేది సాధ్యం కాదు. మరి, ప్రయాణికుల కోసం రైల్వే సంస్థ సరికొత్త అప్ డేట్ లతో లాంఛ్ చేసిన ఈ యాప్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişgrandpashabetcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabettarafbetjojobet girişgrandpashabetgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabetjojobetGrandpashabet