iDreamPost
android-app
ios-app

పల్లవి ప్రశాంత్ తో రతిక క్లోజ్.. అసలు ప్లాన్ ఇదే!

పల్లవి ప్రశాంత్ తో రతిక క్లోజ్.. అసలు ప్లాన్ ఇదే!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఇంట్రస్టింగ్ టర్న్ తీసుకుంటోంది. సాధారణంగా అయితే హౌస్ లో తొలివారం తర్వాత గొడవలు మొదలవుతాయి. కానీ, ఈ సీజన్లో మాత్రం రెండు రోజులకే కొట్లాటలు షురూ అయిపోయాయి. హౌస్ లో అప్పుడే గ్రూపులు కూడా పుట్టుకొచ్చాయి. నామినేషన్స్ తర్వాత ఎవరికి వాళ్లు కొన్ని గ్రూపులుగా మారిపోయారు. అయితే హౌస్ లోనే కాకుండా.. చూసే ప్రేక్షకులకు కూడా అర్థం కాని ఒక కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారు అంటే.. రతికా రోజ్ అనే చెప్పాలి. ఎందుకంటే ఆమె హౌస్ మేట్స్ తో అంతగా కలవడం లేదు. పనులు కూడా చేసినట్లు పెద్దగా కనిపించడం లేదు. నామినేట్ చేసిన అందరూ కూడా రతికా పని చేయట్లేదనే కారణం చెప్పారు. అయితే అసలు రతిక గేమ్ ప్లాన్ ఏంటి? ఎందుకు ఇలా చేస్తోంది? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టిన తర్వాత నుంచి రతిక పేరు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. తెలుగమ్మాయి కావడం, స్పష్టంగా తెలంగాణ యాసలో మాట్లాడటం, చూడటానికి కూడా క్యూట్ గా ఉండటంతో.. కుర్రకారు అంతా ఈమె పేరునే జపిస్తున్నారు. కానీ, ఈమె మాత్రం రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ పేరును జపిస్తోంది. ఏంటి షాకయ్యారా? నిజానికి బిగ్ బాస్ చూస్తున్న చాలా మందికి ఈ విషయమే అర్థం కావడం లేదు. వచ్చిన రెండ్రోజుల్లోనే హీరోయిన్ అయిన రతికా రోజ్.. ఎందుకు పల్లవి ప్రశాంత్ తో క్లోజ్ గా ఉంటోంది? వాళ్లకి బయట పరిచయం ఉన్నట్లు కూడా ఎక్కడా చెప్పలేదు. కానీ, ఎప్పుడూ ప్రశాంత్ వెనుకే తిరుగుతోంది. ప్రతి విషయాన్ని అతనితోనే షేర్ చేసుకుంటోంది. పైగా.. నీకు ఏ హీరోయిన్ ఇష్టం? నీ హార్ట్ లో ఎవరున్నారు అంటూ గుచ్చి గుచ్చి ప్రశ్నిస్తోంది. అందుకు పల్లవి ప్రశాంత్ సమాధానం చెప్పకపోగా.. సిగ్గుతో మెలికలు తిరిగి పోతున్నాడు.

అది చూసిన ప్రిన్స్ యావర్.. శుభ శ్రీ వాళ్లని మంరిత ఎంకరేజ్ చేశారు. మరోవైపు బిగ్ బాస్ కూడా ప్రోమోల్లో వీళ్లని హైలెట్ చేస్తూ.. ఒకటి, రెండు లవ్ BGMలు కూడా వేసేశాడు. ఇది చూసిన ప్రేక్షకులు అరే భయ్ ఏ క్యా హోరహాహై? అంటూ తెల్ల ముఖం వేసేస్తున్నారు. అయితే అదే రతికా రోజ్ గేమ్ ప్లాన్ అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఎప్పుడైతే నవీన్ పోలిశెట్టి ఇచ్చిన లేడీ లక్ బ్యాండ్ ని రతికాకు ఇచ్చాడో.. అప్పటి నుంచి వాళ్లు బాగా క్లోజ్ అయిపోయారు. ఇద్దరూ కలిసి తిరగడం, కలిసి తినడం చేస్తున్నారు. హౌస్ లో వీళ్లు ఇద్దరు మాత్రం కాస్త సపరేట్ గా ఉంటున్నారు. ప్రశాంత్ కూడా మిగిలిన వాళ్లతో పెద్దగా కలుస్తున్నట్లు కూడా కనిపించడం లేదు. తాజాగా రతిక.. నీ గుండెల్లో ఎవరున్నారు అంటూ పల్లవి ప్రశాంత్ ని అడుగుతుంది.

రతిక అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా నీ గుండెల్లో ఎవరున్నారు? అంటూ ప్రశ్నిస్తాడు. అందుకు రతిక ఏమాత్రం తడుముకోకుండా నువ్వే ఉన్నావ్ అంటూ చెప్పుకొచ్చింది. ఆ సమాధానం విని పల్లవి ప్రశాంత్ మెలికలు తిరిగిపోతాడు. తన గుండెల్లో ఎవరున్నారో నువ్వే చూడు అన్నట్లుగా.. రతిక చేయి గుండెల మీద వేసుకుంటాడు. ఆ తర్వాత రతిక తన గుండె చప్పుడు వింటాను అన్నట్లుగా దగ్గరకు వస్తే.. ప్రశాంత్ ఆమెను దగ్గరకు తీసుకుని గుండె చప్పుడు వినిపించాడు. లైవ్ లో, బిగ్ బాస్ ప్రోమోలో ఇదే హైలెట్ సీన్ అయిపోయింది. ఎక్కడ చూసినా రతిక- పల్లవి ప్రశాంత్ పేర్లు వైరల్ అవుతున్నాయి. ఇక్కడే రతికా రోజ్ అసలు గేమ్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేసింది అంటున్నారు.

పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డగా హౌస్ లోకి వచ్చాడు. అతనేం సెలబ్రిటీ కాదు. పైగా ఎవరితోనూ పెద్దగా కలవడం లేదు. అలాంటి వ్యక్తితో క్లోజ్ గా ఉంటే తనకు పాజిటివ్ టాక్ వస్తుందని రతిక భావించి ఉండచ్చు. సాధారణంగానే బిగ్ బాస్ హౌస్ లో.. జంటలకు కవరేజ్ ఎక్కువగా ఉంటుంది. వన్ అవర్ ఎపిసోడ్, ప్రోమోల్లో బాగా హైలెట్ చేస్తారు. ఆ ఉద్దేశంతో కూడా పల్లవి ప్రశాంత్ తో రతిక క్లోజ్ గా ఉండి ఉండచ్చు. కారణం ఏదైనా కావచ్చు.. కానీ, పల్లవి ప్రశాంత్ తో క్లోజ్ గా ఉండటం వెనుక మాత్రం పెద్ద గేమ్ ప్లాన్ ఉంది.. అనే అభిప్రాయాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు బిగ్ బాస్ ఆరు సీజన్లలో ఏ ఒక్కరు కూడా మరీ ఇంత త్వరగా క్లోజ్ అయింది లేదు. అదే విషయాన్ని ఉదాహరణగా చూపిస్తూ రతిక గేమ్ ప్లాన్ గురించి కామెంట్స్ చేస్తున్నారు. ఒకవేళ నిజంగానే నిజం అయితే మాత్రం.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో రతికా రోజ్- పల్లవి ప్రశాంత్ లదే మొట్ట మొదటి జంట అవుతుంది. మరి.. రతిక- పల్లవి ప్రశాంత్ తో క్లోజ్ గా ఉండటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి