iDreamPost
android-app
ios-app

చంద్రబాబు ఇచ్చే రాఖీతో బైపీసీ చదివి.. ఇంజనీర్ కావచ్చు: విజయసాయి రెడ్డి

చంద్రబాబు ఇచ్చే రాఖీతో బైపీసీ చదివి.. ఇంజనీర్ కావచ్చు: విజయసాయి రెడ్డి

ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షడు చంద్రబాబు నాయుడు మాట్లాడే మాటలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ఆయన మాట్లాడే మాటలు, చేసే పనులు చూస్తుంటే.. అసలు ఒకప్పటి చంద్రబాబేనా అనే సందేహం కలుగుతుంది. 40 ఏళ్ల రాజకీయ అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడు.. వింతగా ప్రవర్తిస్తున్నాడు. అధికారం కావాలనే ఆలోచనలో ఏం మాట్లాడుతున్నాను అనే  విషయం మరచి మాట్లాడుతున్నారని చాలా మంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఇటీవలే ఓ ప్రసంగంలో మాట్లాడుతూ.. తాను ఇచ్చే రాఖీ కట్టుకుంటే అన్ని కష్టాలు తొలగిపోతాయంటూ బాబాలు చెప్పే మాటలు చెప్పారు. అలానే  ఇంటర్ లో బైపీసీ చదివి… ఇంజినీరింగ్ కావొచ్చని విజన్-2047లో భాగంగా తెలిపాడు. ఈ వ్యాఖ్యలపై వైపీసీ నేతల నుంచి తీవ్ర స్థాయిలో సెటైర్లు వస్తున్నాయి.

చంద్రబాబు నాయుడి వ్యాఖ్యలపై వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు సెటైర్లు వేస్తున్నారు. 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే బాబు మరోసారి తన అజ్ఞానాన్ని ప్రదర్శించి పరువును పొగొట్టుకోవడంతో ఇదెక్కడి విజనరీ అని అంటున్నారు. తాజాగా వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి కూడా చంద్రబాబు నాయుడిపై సెటైర్లు వేశారు. “చంద్రబాబు ఇచ్చే రాఖీ కట్టుకుంటే ఇంటర్ లో బైపీసీ చదివి.. ఇంజనీర్ కావొచ్చు. అలానే ఆ రాఖీతోనే పోలీస్ అయ్యి వర్క్ ఫ్రమ్ హోమ్ చేయొచ్చు. ఆస్కార్ నామినేషన్ కి వెళ్తే.. నోబెల్  ఫ్రైజ్ రావొచ్చు. అంతేకాక స్వాతంత్య ఉద్యమంలోనూ  పాల్గొనవచ్చు. అది నేనే నిర్మించాను, ఇది నేనే నిర్మించాను అని మాట్లాడుకొవచ్చు” అని విజయ సాయి రెడ్డి చమత్కరించారు. చంద్రబాబుపై విజయసాయి రెడ్డి  చేసిన పరోక్ష కామెట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ప్రభుత్వ ఉద్యోగులకు CM జగన్ వరాల జల్లు.. దసరాకు అదిరిపోయే కానుక!

Jojobet GirişmeritbetmeritbetjojobetHoliganbet girişjojobetJojobet GirişcasibomjojobetjojobetcasibomcasibomPokerklasMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren sitelerCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet giriş