వీడియో: మంతెన సత్యనారాయణ ఆశ్రమంలోకి వరద నీరు!

Manthena Satyanarayana Ashram: ఆంధ్రప్రదేశ్ లో వానలు దంచికొడుతున్నాయి. ఈ క్రమంలోనే పలు ప్రాంతాలు నీట మునిగాయి. అలానే ప్రముఖ ఆరోగ్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమయంలోకి వరద నీరు చేరింది.

Manthena Satyanarayana Ashram: ఆంధ్రప్రదేశ్ లో వానలు దంచికొడుతున్నాయి. ఈ క్రమంలోనే పలు ప్రాంతాలు నీట మునిగాయి. అలానే ప్రముఖ ఆరోగ్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమయంలోకి వరద నీరు చేరింది.

గత రెండు రోజులు గా వానలు కురుస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలు చిగురుటాకుల వణిపోతున్నాయి. ముఖ్యంగా శని, ఆదివారంలో కురిసిన వానకు ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. ముఖ్యంగా విజయవాడ నగరం అయితే సముద్రాన్ని తలపించింది. విజయవాడ పట్టణంలోని పలు కాలనీలు నీటిలో చిక్కుకున్నాయి. పడవల సాయంతో బయటకు వస్తున్నారు. ఇంకా వర్షాలు తగ్గు ముఖం పట్టలేదు. ఈ క్రమంలోనే ప్రముఖ ఆరోగ్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమం వరద నీటికి గురైంది. విజయవాడలోని కరకట్ట రోడ్డుకు పక్కనే ఉండే మంతెన ఆశ్రమంలోకి భారీగా వరద నీరు వచ్చింది.

Show comments