iDreamPost
android-app
ios-app

విశాఖ వాసులకు శుభవార్త.. మెట్రో రైలుకు గ్రీన్ సిగ్నల్!

  • Published Dec 16, 2023 | 6:09 PM Updated Updated Dec 16, 2023 | 6:09 PM

Metro in Visakhapatnam: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తరాంధ్ర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే విశాఖపట్నం కేంద్రంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. తాజాగా విశాఖ వాసులకు ఏపీ ప్రభుత్వం ఓ గుడ్ న్యూస్ చెప్పింది.

Metro in Visakhapatnam: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తరాంధ్ర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే విశాఖపట్నం కేంద్రంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. తాజాగా విశాఖ వాసులకు ఏపీ ప్రభుత్వం ఓ గుడ్ న్యూస్ చెప్పింది.

  • Published Dec 16, 2023 | 6:09 PMUpdated Dec 16, 2023 | 6:09 PM
విశాఖ వాసులకు శుభవార్త.. మెట్రో రైలుకు గ్రీన్ సిగ్నల్!

ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం వాసులకు శుభవార్త అందింది. విశాఖ మహానగరానికి త్వరలో మెట్రోరైలు రానుంది. నగరంలో మెట్రో రైలు పరుగులు తీసే రోజుల కోసం.. ఇక్కడి వాసులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. కాగా, ఇటీవలే ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ రావడంతో.. విశాఖ ప్రజల కల నెరవేరబోతోంది. తాజాగా విశాఖలో లైట్ మెట్రో రైల్ ప్రాజెక్టు డీపీఆర్‎కు.. ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్ర పరిపాలనా రాజధానిగా మార్చబోతున్నామంటూ చెబుతూ వస్తున్న ప్రభుత్వం.. విశాఖ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రంలో పెరుగుతున్న జనాభా, ప్రజల అవసరాలు, ప్రజా రావాణాను వ్యవస్థను పరిగణలోకి తీసుకొని దీనిని మరింత పటిష్ఠం చేసి ముందుకు నడిపించేందుకు కృషి చేస్తోంది. దీనిపై తాజాగా ఆమోదించబడిన డీపీఅర్‎లో అనేక ఆసక్తికర అంశాలు ఉన్నాయి. ఆ వివరాళ్లోకి వెళ్తే..

ఇటీవలే విశాఖలో నాలుగు కారిడార్‎లలో మెట్రో నిర్మాణానికి కేబినెట్ ఆమోదించింది. అలాగే డీపీఅర్ ప్రకారం విశాఖపట్నంలో మెట్రో రైల్‌ ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకోసం.. రాష్ట్ర చరిత్ర, సంస్కృతి, సంప్రదాయం ప్రతిబింబించేలా మెట్రో పిల్లర్లు నిర్మాణం చేపట్టే దిశగా వెళ్తున్నట్లు సమాచారం. ఈ సమాచారం ప్రకారం.. తొలి విడతలో 76.90 కిలో మీటర్ల మేర వరకు లైట్‌ మెట్రో నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు ప్రారంభం చేయునున్నారు. కాగా, నిధుల సమీకరణ విషయంలో మరింత వేగవంతం చేయాలని,కేబినెట్ మెట్రో యాజమాన్యానికి సూచించింది. ఇక తాజా అంచనాల ప్రకారం.. విశాఖ మహానగరంలో 27 లక్షలకు పైగా జనాభా ఉండే అవకాశం ఉంది. అయితే మెట్రో నిర్మాణ ప్రతిపాదనలో ఉన్న శివారు ప్రాంతాలతో కలిపితే.. మొత్తం జనాభా 41 లక్షలు మంది ఉన్నారు. ఇక్కడ అభివృ‌ద్ధికి తొడ్పడుతుందనే ఆశతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తోంది.

ఇక విశాఖలో ఈ ప్రాజెక్టును డీపీఅర్‎ను ఆమోదించడమే కాకుండా.. వచ్చే ఏడాది జనవరి 15న మెట్రో నిర్మాణా పనులకు శంకుస్థాపన చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం అనుకున్నట్లు సమాచారం వినిపిస్తోంది. కానీ, శంకుస్థాపన చేసే సమయానికి నిధుల సేకరణకు అవసరమైన చర్యలు చేపట్టాలని కేబినెట్‎లో చర్చలు జరిగాయి. అందుకు తగిన మార్గాలను చూడాలని, ఏపీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ ఎండీ యూజేఎం రావుకు సైతం.. కేబినెట్ ఆదేశించడమే కాకుండా పలు సూచనలు కూడా చేసిందట.

నాలుగు కారిడార్లు, 54 స్టేషన్ లు:

  • మొత్తం 42 మెట్రో స్టేషన్లతో కూడిన మూడు కారిడార్లను మొదటి దశలో నిర్మించాలని ఆలోచనలో ఉంది.
  • కారిడార్‌–1లో స్టీల్‌ప్లాంట్‌ గేట్‌ నుంచి కొమ్మాది జంక్షన్‌ వరకు 34.40 కిలో మీటర్లు
  • కారిడార్‌–2: గురుద్వార నుంచి పాత పోస్టాఫీస్‌ వరకు 5.07 కిలోమీటర్లు
  • కారిడార్‌–3లో భాగంగా తాటిచెట్లపాలెం నుంచి చినవాల్తేరు వరకూ 6.75 కిలోమీటర్లు మేర ఈ లైట్‌ మెట్రో కారిడార్‌ పూర్తి చేయాలని డీపీఅర్‎లో పేర్కొన్నారు.
  • కారిడార్‌–4లో కొమ్మాది నుంచి భోగాపురం ఎయిర్‌పోర్టు వరకు 30.67 కిలోమీటర్లు
  • మొత్తం ఈ నాలుగు కారిడార్లలో 54 స్టేషన్లు, రెండు డిపోలు ఏర్పాటు చేసేలా డీపీఅర్ లో పేర్కొన్న అధికారులు, ఇప్పుడు నిధుల సమీకరణ పై దృష్టి సారించబోతోంది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom