iDreamPost
android-app
ios-app

AP బడ్జెట్‌ హైలెట్స్‌: రూ.2.86 లక్షల కోట్లతో బడ్జెట్‌.. కేటాయింపులు ఇలా

  • Published Feb 07, 2024 | 3:50 PM Updated Updated Feb 07, 2024 | 3:50 PM

AP Assembly Budget 2024-25: ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన నేడు ఓటాన్‌ ఎకౌంట్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. మొత్తం పద్దు ఏంత.. దేనికి ఎంత క ఏటాయించారు అంటే..

AP Assembly Budget 2024-25: ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన నేడు ఓటాన్‌ ఎకౌంట్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. మొత్తం పద్దు ఏంత.. దేనికి ఎంత క ఏటాయించారు అంటే..

  • Published Feb 07, 2024 | 3:50 PMUpdated Feb 07, 2024 | 3:50 PM
AP బడ్జెట్‌ హైలెట్స్‌: రూ.2.86 లక్షల కోట్లతో బడ్జెట్‌.. కేటాయింపులు ఇలా

అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. మధ్యంతర బడ్జెట్‌ ప్రవేశపెట్టింది. రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి.. 2024-25 సంవత్సరానికి గాను 2,86,389 కోట్ల రూపాయల అంచనాలతో ఓటాన్‌ ఎకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ మొత్తంలో రూ.2,30,110 కోట్లు రెవెన్యూ వ్యయం కాగా.. రూ.30,530 కోట్ల మూలధన వ్యయంతో బడ్జెట్‌ను ప్రతిపాదించారు. రూ.24,758 కోట్ల రెవెన్యూ లోటు, రూ.55,817 కోట్ల ద్రవ్యలోటును అంచనా వేశారు. ఇక రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ)లో 3.51 మేర ద్రవ్య లోటు, 1.56 శాతం రెవెన్యూ లోటు ఉంటుందని తెలిపారు. అంతేకాక ఆర్థిక సంవత్సరానికి మొత్తానికి బడ్జెట్‌ ప్రతిపాదనలు సమర్పించినా.. ఏప్రిల్‌ నుంచి జూలై నెలల వరకే ఆమోదం తీసుకుంటారు. ఇక పూర్తిస్థాయి బడ్జెట్‌ను ఎన్నికల తర్వాత కొత్తగా కొలువుదీరే ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.

ఏడు అంశాల ఆధారంగా బడ్జెట్‌ రూపకల్పన జరిగింది అని ఆర్థిక మంత్రి బుగ్గన చెప్పుకొచ్చారు. సుపరిపాలన, సామార్థ్య ఆంధ్ర, మన మహిళా మహారాణుల ఆంధ్ర, సంపన్నుల ఆంధ్ర, భూభద్ర ఆంధ్ర, అన్నపూర్ణ ఆంధ్ర ప్రతిపాదికగా బడ్జెట్‌ను రూపొందించినట్లు వెల్లడించారు. అంతేకాక వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి నిబ‍ద్ధత తమ పాలనలో ప్రతి ఫలించింది అన్నారు బుగ్గన. అంతేకాక అర్థశాస్త్రంలో కౌటిల్యుడు పేర్కొన్న విధంగానే జగన్‌ పాలన సాగింది అని తెలిపారు. 1.35 లక్షల మంది ఉద్యోగులతో గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేశామన్నారు.

కుప్పం సహా నేక కొత్త రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేయడమే కాక.. ఆరు పోలీస్‌ స్టేషన్లతో కుప్పం పోలీస్‌ సబ్‌ డివిజన్‌ను ఏర్పాటు చేశామన్నారు. అంతేకాక ప్రతి జిల్లాలో దిశా పోలీసు స్టేషన్లను ఏర్పాటు చేశామని బుగ్గన వెల్లడించారు. విద్య, వైద్య, వ్యవసాయం, ఆక్వా, పోర్టులు, పరిశ్రమలు, ఉద్యోగాల కల్పన, పెట్టుబడులు వంటి రంగాల్లో తమ ప్రభుత్వం సాధించిన ప్రగతిని, అమలు చేసిన పథకాలను ఈ సందర్భంగా వివరించారు మంత్రి బుగ్గన.

కేబినెట్‌ భేటీలో మరికొన్ని కీలక నిర్ణయాలు..

  1. బడ్జెట్‌ సమర్పణకు ముందు కేబినెట్‌ భేటీ జరిగింది. ఈ సందర్భంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అవి
  2. నంద్యాల జిల్లా డోన్‌లో కొత్తగా హార్టికల్చర్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పాలిటెక్నిక్‌ కాలేజ్‌ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. ఇది డాక్టర్‌ వైఎస్సార్‌ హార్టికల్చర్‌ యూనివర్శిటీ పరిధిలో పనిచేయనుంది అన్నారు.
  3. అలానే వ్యవసాయ రంగం కోసం నంద్యాల జిల్లా డోన్‌లో రెండేళ్ల డిప్లొమా కోర్స్‌తో వ్యవసాయ పాలిటెక్నిక్‌ కాలేజీ ఏర్పాటుకి ఆమోదం తెలిపారు. ఇది ఆచార్య ఎన్‌జీ రంగా అగ్రికల్చర్‌ యూనివర్శిటీ పరిధిలో పనిచేయనుంది.
  4. ఆంధ్రప్రదేశ్‌ ప్రైవేట్‌ యూనివర్శిటీస్‌ (ఎస్టాబ్లిష్‌మెంట్‌ అండ్‌ రెగ్యులేషన్‌) యాక్ట్‌ 2016కు సవరణలు చేయడం ద్వారా బ్రౌన్‌ ఫీల్డ్‌ కేటగిరిలో 3 ప్రైవేట్‌ యూనివర్శిటీలకు అనుమతి ఇచ్చారు.
  5. అన్నమయ్య జిల్లా రాజంపేటలో అన్నమాచార్య యూనివర్శిటీ, తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గోదావరి గ్లోబల్‌ యూనివర్శిటీ, కాకినాడ జిల్లా సూరంపాలెంలో ఆదిత్య యూనివర్శిటీల ఏర్పాటుకు ఆమోదం తెలిపారు.
  6. ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో ఫిబ్రవరి 5 నాడు ఉభయసభలనుద్దేశించి.. ప్రసంగించిన గవర్నర్‌ స్పీచ్‌కు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

Jojobet GirişmeritbetmeritbetholiganbetHoliganbet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetcasibomholiganbetPokerklasMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren sitelerCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişdirect to wallet crypto swap