iDreamPost

బిర్యానీ కోసం ఫైటింగ్.. యువకుడిని కత్తులతో నరికి చంపిన దండగులు!

బిర్యానీ కోసం ఫైటింగ్.. యువకుడిని కత్తులతో నరికి  చంపిన దండగులు!

ఈ మధ్యకాలంలో కొందరు వ్యక్తులు క్షణికావేశంలో దారుణాలకు పాల్పడుతున్నారు. అచ్చం ఇలాగే బరితెగించిన మద్యం మత్తులో ఉన్న కొందరు దుర్మార్గులు ఎవరూ ఊహించని ఘోరానికి పాల్పడ్డారు. కేవలం బిర్యానీ కోసం ఓ యువకుడిని అతి కిరాతకంగా కత్తులతో పొడిచి చంపారు. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు నిందితులను పట్టుకునే పనిలో ఉన్నారు. అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. చెన్నైలోని ఓ ప్రాంతానికి చెందిన బాలచంద్రన్ (22) అనే యువకుడు ఆదివారం బిర్యానీ తినేందుకు తన స్నేహితుడితో పాటు మన్నూరుపేటలో ఉన్న ఓ రెస్టారెంట్ కు వెళ్లారు. అక్కడికి వెళ్లాక బాలచంద్రన్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చాడు. ఇక వీరితో పాటు అక్కడికి వచ్చిన మద్యం మత్తులో ఉన్న మరి కొంతమంది యువకులు కూడా బిర్యానీ ఆర్డర్ ఇచ్చారు. ఈ క్రమంలోనే మత్తులో ఉన్న ఆ యువకులు బాలచంద్రన్ తో గొడవకు దిగారు. ఇదే గొడవ చినికి చినికి చివరికి గాలి వానలా మారింది. దీంతో ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకున్నారు. ఇక పట్టరాని కోపంతో ఊగిపోయిన ఆ యువకులు.. బాలచంద్రన్ ను కత్తులతో పోడిచారు.

వీరి దాడిలో బాలచంద్రన్ అక్కడికక్కడే రక్తపు మడుగులో పడి ప్రాణాలు కోల్పోయాడు. స్థానికులు అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువకుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇక ఈ విషయం తెలుసుకుని మృతుని కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా ఏడ్చారు. అనంతరం బాలచంద్రన్ తల్లిదండ్రుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.

ఇది కూడా చదవండి: ప్రియుడిని మరువలేక.. ప్రియురాలు ఊహించని పని!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి