iDreamPost

సీఎం అపాయింట్మెంట్‌ కోరిన సచివాలయ ఉద్యోగులు

సీఎం అపాయింట్మెంట్‌ కోరిన సచివాలయ ఉద్యోగులు

ఆంధ్రప్రదేశ్‌ సచివాలయ ఉద్యోగులు సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి అపాయింట్మెంట్‌ కోరారు. మంత్రివర్గ సమావేశంలో జీఎన్‌ రావు కమిటీ నివేదిక ఆధారంగా విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపధ్యంలో సచివాలయంలోని కొంత మంది ఉద్యోగులు సీఎంను కలవాలనుకుంటున్నారు.

హైదరాబాద్‌ నుంచి తమ కుటుంబాలను ఇంకా ఇక్కడకు తీసుకురాలేదని, ప్రస్తుతం వెళ్లి వస్తున్నామని, ఇప్పుడు విశాఖ నుంచి విధులు నిర్వహించాలంటే తమకు దూరం అవుతందని సచివాలయంలోని కొంత మంది ఉద్యోగులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారు సీఎంను కలసి తమ సమస్యలను చెప్పుకునేందుకు అపాయింట్మెంట్‌ అడిగారని సమాచారం.

కాగా, ఈ విషయంలో సచివాలయ ఉద్యోగుల్లో భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విశాఖకు వెళ్లేందుకు అధికశాతం మంది సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సచివాలయ ఉద్యోగులు రెండు గ్రూపులుగా విడిపోయారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి