iDreamPost

ఇంటర్నెట్‌ను షేక్‌ చేస్తోన్న వీడియో.. మనిషి దాహం తీర్చిన ఏనుగు

  • Published Apr 28, 2024 | 6:34 PMUpdated Apr 28, 2024 | 6:34 PM

సాధారణంగా దాహంతో ఉన్న మూగజీవులను అర్ధం చేసుకొని మనుషులు వాటికి నీరుని తాగిపించడం మనం చూసే ఉంటాం. కానీ, తాజాగా మహారాష్ట్రలో జరిగిన ఓ సంఘటనలో మాత్రం ఆ సీన్ కాస్త రీవర్స్ గా ఉంటుంది. ఓ ఏనుగే ఏకంగా మనిషి దాహన్ని తీర్చింది. అదేలా అంటే..

సాధారణంగా దాహంతో ఉన్న మూగజీవులను అర్ధం చేసుకొని మనుషులు వాటికి నీరుని తాగిపించడం మనం చూసే ఉంటాం. కానీ, తాజాగా మహారాష్ట్రలో జరిగిన ఓ సంఘటనలో మాత్రం ఆ సీన్ కాస్త రీవర్స్ గా ఉంటుంది. ఓ ఏనుగే ఏకంగా మనిషి దాహన్ని తీర్చింది. అదేలా అంటే..

  • Published Apr 28, 2024 | 6:34 PMUpdated Apr 28, 2024 | 6:34 PM
ఇంటర్నెట్‌ను షేక్‌ చేస్తోన్న వీడియో.. మనిషి దాహం తీర్చిన ఏనుగు

ప్రస్తుతం ఎక్కడ చూసిన నిప్పులు కక్కుతున్న ఎండాలతో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఈ భగ భగ మంటున్నా ఎండాలు.. తీవ్రమైన ఉష్ణోగ్రతలతో ప్రజలు బెంబేలిత్తిపోతున్నారు. అయితే మండుతున్న ఈ ఎండలకు అటు మనుషులతో పాటు మూగజీవులు కూడా సతమతమవుతున్నాయి. అయితే మనుషుల పరిస్థితే ఒక రకంగా ఉన్నా.. మూగజీవాలైన జంతువులు, పక్షులు మాత్రం తాగేందుకు నీళ్లు లేక దంచికొడుతున్నా ఎండలకు దాహంతో అల్లాడుతున్నాయి. ఈ క్రమంలోనే చాలమంది జంతు ప్రేమికులు.. జంతువులు, పక్షులకు నీళ్లు అందించి వాటి ప్రాణాలు కాపాడేందుకు.. ఇంటి బయట నీరు పెట్టడం.. అవి దాహంతో రొడ్డు మీద బిక్కుబిక్కుమంటూ ఉంటున్న వాటికి నీళ్లను తాగించడం వంటివి చేస్తుంటారు. అయితే మహారాష్ట్రలో జరిగిన ఓ సంఘటన మాత్రం ఆ సీన్ కాస్త రివర్స్ గా ఉంటుంది. ఇప్పటి వరకు దాహంతో అల్లాడుతున్న మూగ జంతువులకు మనుషులు నీళ్లు తాగించడం చూసే ఉంటాం. కానీ, తాజాగా జరిగిన ఓ సంఘటనలో మాత్రం ఒక ఏనుగు మనిషి దాహన్ని తీర్చింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

సాధారణంగా దాహంతో ఉన్న మూగజీవులను అర్ధం చేసుకొని మనుషులు వాటికి నీరుని తాగిపించడం మనం చూసే ఉంటాం. కానీ, తాజాగా మహారాష్ట్రలో జరిగిన ఓ సంఘటనలో మాత్రం ఆ సీన్ కాస్త రీవర్స్ గా ఉంటుంది. ఓ ఏనుగే ఏకంగా మనిషి దాహన్ని తీర్చింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింద. అసలు ఏం జరిగిందంటే.. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా అహేరి తాలూకా కమలాపూర్ లోని ఏనుగుల పార్క్ లోని చేతి పంపును ఏనుగు తొండంతో కొడుతుండగా.. ఆ పార్క్ గార్డు సుదీప్ నీళ్లు తాగి దాహం తీర్చుకున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియోను చూసిన నెటిజన్స్ అచ్చం మనిషిలానే తొండంతో ఆ ఏనుగు చేతి పంపు కొడుతూ.. ఆ వ్యక్తి దాహంను తీరుస్తుందని పలువురు దానికి హ్యాట్సాఫ్ చెబుతున్నారు. కాగా, ఈ ఏనుగుల పార్కులో ప్రస్తుతం 9 వరకు చిన్న, పెద్ద ఏనుగులు ఉన్నాయని.. వేసవి కాలంలో అడవిలోని చుట్టుపక్కల నీటి వనరులు ఎండిపోయినప్పుడు ఆ ఏనుగులు ఇలా చేస్తుంటాయని క్యాంప్ నిర్వాహకులు చెబుతున్నారు. అయితే ఏదీ ఏమైనా ఇలా ఒక మనిషి దాహన్ని ఏనుగు అర్ధం చేసుకొని తీర్చడం చాలా గ్రేట్ అంటూ నెటిజన్స్ ఆ ఏనుగును ప్రశంసిస్తున్నారు. మరి, ఓ మనిషి దాహన్ని ఏనుగు తీర్చడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి