Nidhan
కొత్త కెప్టెన్గా హార్దిక్ పాండ్యాను నియమించడం ముంబై ఇండియన్స్కు తలనొప్పిగా మారింది. ఆ టీమ్ అన్ని వైపుల నుంచి విమర్శలు ఎదుర్కొంటోంది. ఈ టైమ్లో జట్టులోని సీనియర్ ప్లేయర్లు బుమ్రా, సూర్యకుమార్ షాకింగ్ పోస్ట్ పెట్టారు.
కొత్త కెప్టెన్గా హార్దిక్ పాండ్యాను నియమించడం ముంబై ఇండియన్స్కు తలనొప్పిగా మారింది. ఆ టీమ్ అన్ని వైపుల నుంచి విమర్శలు ఎదుర్కొంటోంది. ఈ టైమ్లో జట్టులోని సీనియర్ ప్లేయర్లు బుమ్రా, సూర్యకుమార్ షాకింగ్ పోస్ట్ పెట్టారు.
Nidhan
క్లబ్, ఫ్రాంచైజీ క్రికెట్లో అనూహ్య నిర్ణయాలు తీసుకోవడం సర్వసాధారణమే. ఏ ప్లేయర్ ఏ టీమ్లోనూ పర్మినెంట్గా ఉండలేడు. ముఖ్యంగా ఏ ఆటగాడు కూడా తాను ఆడినన్ని రోజులు కెప్టెన్గా ఉండటం కుదరదు. ఏదో ఒక రోజు సారథ్య బాధ్యతల్ని ఇతరులకు అప్పగించక తప్పదు. అయితే ఇదంతా గౌరవప్రదంగా జరిగితే బాగుంటుంది. కానీ ఇష్టం వచ్చినట్లు అడ్డగోలుగా వ్యవహరిస్తే మాత్రం అభిమానులు, ప్రేక్షకుల దగ్గర నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కోక తప్పదు. ఇపుడు ముంబై ఇండియన్స్ పరిస్థితి ఇలాగే ఉంది. ఐపీఎల్-2024 ఆక్షన్కు ముందు ఆ జట్టు సంచలన నిర్ణయం తీసుకుంది. టీమ్ సారథ్య బాధ్యతల్ని హార్దిక్ పాండ్యాకు అప్పగించింది. దీంతో రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తొలగించడంపై అతడి అభిమానులతో పాటు ముంబై ప్లేయర్లు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ముంబై బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్, పేసర్ జస్ప్రీత్ బుమ్రా తాజాగా సోషల్ మీడియాలో షాకింగ్ పోస్ట్ పెట్టారు. సూర్య ట్విట్టర్ వేదికగా హార్ట్ బ్రేక్ ఎమోజీని షేర్ చేశాడు. కెప్టెన్ను మారుస్తూ ముంబై ఫ్రాంచైజీ తీసుకున్న డెసిజన్ తనకు నచ్చలేదని పరోక్షంగా అతడు చెప్పకనే చెప్పాడు. ఈ పోస్ట్కు ఎలాంటి కామెంట్స్, హ్యాష్ ట్యాగ్ లేకుండా తన ఆవేదనను ఎమోజీ రూపంలో పంచుకున్నాడు. అటు బుమ్రా కూడా ఓ వెరైటీ పోస్ట్ పెట్టాడు. ‘నిశ్శబ్దమే సరైన జవాబు’ అని ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో షేర్ చేశాడు. దీంతో వీరి పోస్ట్లను రోహిత్ ఫ్యాన్స్ నెట్టింట వైరల్ చేస్తున్నారు. ఈ సమస్యను పరిష్కరించకపోతే ఎంఐకి తీవ్ర ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఇక, సూర్య, బుమ్రాల కెరీర్ ఈ రేంజ్లో ఉండటంలో రోహిత్ శర్మ ఎంతో కీలకమైన పాత్ర పోషించాడు. ముంబై జట్టు తరఫున ఫెయిలైనా కూడా వీరి మీద నమ్మకం ఉంచి అవకాశాలు ఇచ్చాడు. హిట్మ్యాన్ ఎంకరేజ్మెంట్ వల్లే వాళ్లు ఈ స్థాయిలో ఉన్నారని చెప్పొచ్చు. ముంబైతో పాటు టీమిండియా కెప్టెన్గా కూడా రోహిత్తో సూర్య, బుమ్రాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది.
బుమ్రా, సూర్యల పోస్ట్లు.. రోహిత్ శర్మకు మద్దతుగా గానే గాక ఫ్రాంచైజీ నిర్ణయానికి వ్యతిరేకంగానూ కనిపిస్తున్నాయి. ఎందుకంటే గుజరాత్ టైటాన్స్ సారథిగా ఉన్న హార్దిక్ పాండ్యాను ఇటీవల ప్లేయర్ల రిటెన్షన్లో భాగంగా ముంబై దక్కించుకున్నప్పుడు బుమ్రా పరోక్షంగా తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. ఇన్నాళ్లూ టీమ్కు నమ్మకంగా ఉండి వేరే ఆఫర్స్ వచ్చినా వదులుకుంటే ఆఖరుకు రోహిత్ ప్లేసులో హార్దిక్ను కెప్టెన్ చేయడం బుమ్రాకు నచ్చలేదని వార్తలు వచ్చాయి. ఇదే విషయంలో ఎంఐ తీరు మీద సూర్యకుమార్ కూడా సంతృప్తిగా లేడని క్రికెట్ వర్గాలు అంటున్నాయి. ఇలాంటి తరుణంలో ఎవరికీ చెప్పకుండా హఠాత్తుగా రోహిత్ను తీసేసి హార్దిక్ను కెప్టెన్ చేయడం వీళ్లను మరింత ఆగ్రహానికి గురిచేసిందని చెబుతున్నారు. మరి.. ఎంఐ కెప్టెన్సీ మార్పు నేపథ్యంలో సూర్య, బుమ్రా చేసిన పోస్టుల మీద మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Jasprit Bumrah – Silence
Suryakumar Yadav – 💔What’s going on in Mumbai Indians? pic.twitter.com/RASmPvuCaZ
— CricketGully (@thecricketgully) December 16, 2023