iDreamPost
android-app
ios-app

టాప్​-2లోకి SRH.. కమిన్స్ సేనకు కలిసొచ్చిన రాజస్థాన్ మూర్ఖత్వం!

  • Published May 20, 2024 | 8:03 AMUpdated May 20, 2024 | 8:03 AM

ప్లేఆఫ్స్​లోకి అడుగుపెడితే చాలనుకున్న సన్​రైజర్స్ హైదరాబాద్.. ఏకంగా టాప్​-2లోకి ఎంట్రీ ఇచ్చింది. దీంతో క్వాలిఫయర్-1లో ఆడే గోల్డెన్ ఛాన్స్​ను కొట్టేసింది కమిన్స్ సేన.

ప్లేఆఫ్స్​లోకి అడుగుపెడితే చాలనుకున్న సన్​రైజర్స్ హైదరాబాద్.. ఏకంగా టాప్​-2లోకి ఎంట్రీ ఇచ్చింది. దీంతో క్వాలిఫయర్-1లో ఆడే గోల్డెన్ ఛాన్స్​ను కొట్టేసింది కమిన్స్ సేన.

  • Published May 20, 2024 | 8:03 AMUpdated May 20, 2024 | 8:03 AM
టాప్​-2లోకి SRH.. కమిన్స్ సేనకు కలిసొచ్చిన రాజస్థాన్ మూర్ఖత్వం!

ప్లేఆఫ్స్​లోకి అడుగుపెడితే చాలనుకున్న సన్​రైజర్స్ హైదరాబాద్.. ఏకంగా టాప్​-2లోకి ఎంట్రీ ఇచ్చింది. దీంతో క్వాలిఫయర్-1లో ఆడే గోల్డెన్ ఛాన్స్​ను కొట్టేసింది కమిన్స్ సేన. టాప్​-2లో నిలవాలంటే పంజాబ్ కింగ్స్​ను తప్పక ఓడించాల్సిన స్థితిలో ఉన్న ఆరెంజ్ ఆర్మీ.. నిన్న ఆ టీమ్​ను 4 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. పంజాబ్ సంధించిన 215 పరుగుల లక్ష్యాన్ని ఇంకో 5 బంతులు ఉండగానే అందుకుంది. డేంజరస్ ట్రావిస్ హెడ్ ఫస్ట్ బాల్​కే ఔటైనా తగ్గేదేలే అంటూ చెలరేగింది. అభిషేక్ శర్మ (28 బంతుల్లో 66), హెన్రిచ్ క్లాసెన్ (26 బంతుల్లో 42) విధ్వంసక ఇన్నింగ్స్​లతో టీమ్​కు విజయాన్ని అందించారు. ఈ గెలుపుతో 17 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది ఎస్​ఆర్​హెచ్. అటు కేకేఆర్​తో ఆడాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో రాజస్థాన్ మూడో స్థానంతో సరిపెట్టుకుంది.

కోల్​కతా మీద నెగ్గితే రాజస్థాన్ టాప్​-2లోకి వచ్చేది. కానీ వాన కారణంగా ఒక్క బాల్ కూడా పడకుండానే మ్యాచ్ రద్దయింది. పాయింట్లలో ఎస్​ఆర్​హెచ్-ఆర్ఆర్ సమానంగా నిలిచినా, నెట్ రన్ రేట్ పరంగా ఆరెంజ్ ఆర్మీ ముందుండటంతో క్వాలిఫయర్-1లో ఆడే అవకాశాన్ని దక్కించుకుంది. దీంతో ఎస్​ఆర్​హెచ్ అభిమానులు సంతోషంలో మునిగిపోయారు. క్వాలిఫయర్-1లో గెలిస్తే నేరుగా ఫైనల్ చేరే ఛాన్స్, ఒకవేళ ఓడితే క్వాలిఫయర్-2లో ఆడాల్సి ఉంటుంది. ఇలా ఫైనల్​లో చోటు కోసం ఎస్​ఆర్​హెచ్​కు రెండు అవకాశాలు దక్కనున్నాయి. మరోవైపు రాజస్థాన్ ఫ్యాన్స్ డీలాపడిపోయారు. ఈజీగా టాప్-2లో నిలవాల్సిన టీమ్ క్వాలిఫయర్​లో ఛాన్స్ కోసం బెంగళూరును తప్పక ఓడించాల్సిన పరిస్థితి నెలకొంది. అది ఆ జట్టుకు నాకౌట్ మ్యాచ్ కానుంది. ఓడితే ఇక ఇంటికే. అయితే రాజస్థాన్​కు ఈ సిచ్యువేషన్ ఏర్పడటానికి ఆ టీమే కారణమనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

రాజస్థాన్ తన చెట్టును తానే నరుక్కుందని, ఆ జట్టు మూర్ఖత్వం సన్​రైజర్స్​కు వరంగా మారిందని అంటున్నారు. సాధారణంగా సంజూ సేన ఆడే హోమ్ మ్యాచులన్నీ జైపూర్​లోనే జరుగుతాయి. ఈ టైమ్​లో దేశంలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. అలాగే నిన్న కేకేఆర్-ఆర్ఆర్ మ్యాచ్​కు ఆతిథ్యం ఇచ్చిన గౌహతిలోని బసాపురా స్టేడియం దగ్గరా భారీ వర్షం పడింది. వాన ఎంతకీ ఆగకపోవడంతో మ్యాచ్ రద్దయింది. ఈ సమయంలో జైపూర్​లోనూ వర్షాలు పడుతున్నాయి. అయితే అక్కడ వాన వల్ల మ్యాచ్​లు పూర్తిగా రద్దయిన సందర్భాలు చాలా అరుదు. ఒకవేళ వర్షం పడినా ఎన్నో కొన్ని ఓవర్లతో మ్యాచ్​లు నిర్వహించేవారు. అలాంటిది అక్కడ మ్యాచ్​ పెట్టాల్సింది పోయి రాజస్థాన్ టీమ్ గౌహతి గ్రౌండ్​ను ఎంచుకుంది. ఈ ఏరియాలో ఈ సమయంలో భారీ వర్షాలు పడతాయని తెలిసినా, ఆఖరి లీగ్ మ్యాచ్​లతో ప్లేఆఫ్స్ ఛాన్సులు తారుమారవుతాయని తెలిసినా రాజస్థాన్ మేనేజ్​మెంట్ ఈ డెసిషన్ ఎందుకు తీసుకుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఫ్రాంచైజీ మూర్ఖత్వం వల్ల జట్టుకు తీవ్ర నష్టం కలిగిందని, ఇది ఎస్​ఆర్​హెచ్​కు కలిసొచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Epic Cricket Comments (@epic.cricket_comments)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి