iDreamPost

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రామ్‌ చరణ్-ఉపాసన

  • Published Mar 27, 2024 | 10:01 AMUpdated Mar 27, 2024 | 10:01 AM

Ramcharan Couple Visits Tirumala: మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన హీరో రామ్ చరణ్ వరుస విజయాలతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు.

Ramcharan Couple Visits Tirumala: మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన హీరో రామ్ చరణ్ వరుస విజయాలతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు.

  • Published Mar 27, 2024 | 10:01 AMUpdated Mar 27, 2024 | 10:01 AM
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రామ్‌ చరణ్-ఉపాసన

మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలు ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేక ఇమేజ్ తో దూసుకుపోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ ‘చిరుత’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చి రెండో సినిమా ‘మగధీర’ మూవీతో తెలుగు రాష్ట్రాల్లో రికార్డులు క్రియేట్ చేశారు. వరుస విజయాలతో దూసుకు పోతున్న రామ్ చరణ్.. రాజమౌళి దర్శత్వంలో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీతో గ్లోబల్ స్టార్ గా ఎదిగారు. ఇటీవల రామ్ చరణ్ సతీమణి ఉపాసన పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. చిన్నారి పేరు క్లీంకార. నేడు రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో సుప్రభాత సేవలో స్వామివారిని దర్శించుకున్నారు. వివరాల్లోకి వెళితే..

నేడు టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు.  బుధవారం తెల్లవారుజామున ఆయన సతీమణి ఉపాసన, కూతురు క్లింకారతో కలిసి సుప్రభాత సేవలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా టీటీడీ అధికారులు రామ్ చరణ్ కుటుంబ సభ్యులకు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో రామ్ చరణ్ దంపతులకు పండితులు వేదాశీర్వచనం, అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. దర్శనాంతరం ఆలయం వెలుపలికి వచ్చిన రామ్ చరణ్ దంపతులను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. పుట్టిన రోజు పురస్కరించుకొని మంగళవారం సాయంత్రమే ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు రామ్ చరణ్ దంపతులు. అక్కడ నుంచి తిరుమల బయలుదేరారు.

Ramcharan at tirumala

రామ్ చరణ్ తన 39వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. కూతురు క్లింకార పుట్టిన తర్వాత మొదటిసారిగా తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోవడం విశేషం. దీంతో అక్కడ వాతావరణం ఎంతో కోలాహలంగా మారింది. అభిమానులు రామ్ చరణ్ దంపతులతో పాటు వారి కూతురు క్లింకారని చూడటానికి ఉత్సాహం చూపించారు. ప్రస్తుతం రామ్ చరణ్ సెన్సేషన్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ ఛెంజర్’ మూవీలో నటిస్తున్నారు. హీరోయిన్ గా బాలీవుడ్ అందాల తార కియారా అద్వాని నటిస్తుంది. పొలిటికల్ థ్రిల్లర్ గా ఈ మూవీ రూపొందుతున్నట్లు సమాచారం. ఈ మూవీలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయంలో నటిస్తున్నట్లు ఇండస్ట్రీ టాక్. రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్బంగా బ్లాక్ బస్టర్ మూవీ ‘మగధీర’ రీ రిలీజ్ చేస్తున్నారు. మెగా అభిమానులు తమ అభిమాన హీరోకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ.. సెలబ్రేషన్స్ చేస్తున్నారు. ఈ రోజు ‘గేమ్ ఛెంజర్’ నుంచి మొదటి సాంగ్ ‘జరగండి జరగండి’ సాంగ్ రిలీజ్ అయ్యింది. సోషల్ మీడియాలో దుమ్మురేపుతుంది.


వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి