iDreamPost
android-app
ios-app

Pushpa-2: వేటపై పడి విరుచుకుతినే సింహంలా ఐకాన్ స్టార్!

పుష్ప సినిమాతో అల్లు అర్జున్ నేషనల్ స్టార్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సినీ ఇండస్ట్రీలో అనేక రికార్డులన తిరగరాసింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కీలక అప్ డేట్ బయటకు వచ్చింది.

పుష్ప సినిమాతో అల్లు అర్జున్ నేషనల్ స్టార్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సినీ ఇండస్ట్రీలో అనేక రికార్డులన తిరగరాసింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కీలక అప్ డేట్ బయటకు వచ్చింది.

Pushpa-2: వేటపై పడి విరుచుకుతినే సింహంలా ఐకాన్ స్టార్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న సినిమా పుష్ప-2. ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతుంది. ఈ సినిమాపై బన్నీ ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. విడుదలకు సమయం దగ్గర పడుతున్న కొద్ది ప్రమోషన్స్ లో మేకర్స్ స్పీడ్ పెంచారు. అందుకే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ‘పుష్పా పుష్పా’ సాంగ్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ సాంగ్ విడుదలైంది. ‘సూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామి’ అనే సాంగ్ ప్రేక్షకులను ఓ స్థాయిలో ఆకట్టుకుంటున్నది.  ప్రస్తుతం ఈ సాంగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పుష్ప సినిమాతో అల్లు అర్జున్ నేషనల్ స్టార్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సినీ ఇండస్ట్రీలో అనేక రికార్డులను తిరగరాసింది. ఇక ఆ సినిమాకు సీక్వెల్ గా పుష్పా-2 సినిమాను తెరక్కెకిస్తున్నారు. ఇక సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన గ్లింప్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేశాయి. ఈ చిత్రం రిలీజ్ సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌లో మేకర్స్‌ స్పీడ్ పెంచారు. తాజాగా ‘సూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామి’  అనే సాంగ్‌ ను విడుదల చేశారు. ఈ సాంగ్  ప్రేక్షకులను ఓ స్థాయిలో ఆకట్టుకుంటున్నది. ఇప్పటికే ‘పుష్పరాజ్‌’గా ఉన్న బన్నీకి సంబంధించిన రెండుమూడు స్టిల్స్‌ విడుదల చేశారు. అదే విధంగా రష్మిక లుక్స్‌ కూడా విడుదల చేశారు. కొన్ని రోజుల క్రితం విడుదలైన ‘పుష్ప పుష్ప పుష్పరాజ్‌..’ పాట రెండు తెలుగురాష్ర్టాల్లో మోత మోగిపోతున్నది.

ఈ సంగతులు ఇలాంటే.. ఈ చిత్రంకి సంబంధించి తాజాగా ఓ కీలక అప్ డేట్ బయటకు వచ్చింది. అది కూడా ‘పుష్ప-2’ ఇంటర్వెల్‌ గురించి అనే టాక్ వినిపిస్తోంది. భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌గా ఈ ఇంటర్వెల్  సన్నీవేశాన్ని దర్శకుడు సుకుమార్ ప్లాన్ చేశారంట. ఈ ఫైట్‌లో వేటపై పడి విరుచుకుతినే సింహంలా బన్నీకనిపిస్తారట. ఈ యాక్షన్‌ సీక్వెన్స్‌ సినిమాకే ప్రధానం కానుందని టాక్ వినిపిస్తోంది. మైత్రీమూవీమేకర్స్‌ నిర్మిస్తున్న ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్ అందిస్తున్న సంగతి తెలిసిందే. ఆగస్ట్‌ 15న ఈ సినిమా విడుదల కానుంది. మరి.. ఈ సినిమాకు సంబంధించిన ఈ తాజా అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి