రైతు భరోసాపై టీడీపీ, జనసేన పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని వ్యవసాయ మిషన్ వైస్ ప్రెసిడెంట్ నాగిరెడ్డి విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అర్హులందరికీ రైతు భరోసా, దరఖాస్తుకు నెలరోజుల సమయం ఉందని, రాష్ట్రం, కేంద్రం సమన్వయంతో పనిచేస్తోందన్నారు. ఏ పథకానికి బడ్జెట్ కేటాయించినా కేంద్రం నిధులు కలుపుకుంటారని, రాష్ట్ర ప్రభుత్వం నిధులతోనే భరోసా ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పలేదని ఆయన అన్నారు. టీడీపీ ఇచ్చిన ఏ ఒక్క హామీని చంద్రబాబు అమలు చేయలేదని, జగన్ పారదర్శకత పాలన చూసి ఓర్వలేకపోతున్నారని నాగిరెడ్డి మండిపడ్డారు.