iDreamPost
android-app
ios-app

ఏపీలో తాజాగా 58 మందికి కరోనా నిర్దారణ

ఏపీలో తాజాగా 58 మందికి కరోనా నిర్దారణ

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి.. గడచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ లో 58 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్దారణ అయింది. దీంతో రాష్ట్రంలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 1583 కు చేరిందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. కాగా  488 మంది వైరస్ బారి నుండి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కరోనా ఆక్టీవ్ కేసుల సంఖ్య 1062 గా నమోదయింది. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 33 మంది మరణించారు.

అత్యధికంగా కర్నూల్ లో 30 మందికి వైరస్ నిర్దారణ కాగా, గుంటూరులో 11 ,కృష్ణా 8,అనంతపురంలో 7,చిత్తూరు 1, నెల్లూరులో ఒకరికి కరోనా వైరస్ నిర్దారణ అయింది. కేసులు సంఖ్య క్రమంగా తగ్గడం ఊరటనిచ్చే విషయం.

ఆంధ్రప్రదేశ్ లో గుంటూరు, కృష్ణా, కర్నూలు, నెల్లూరు, చిత్తూరు జిల్లాలు రెడ్ జోన్ లో ఉండగా,అనంతపురం,కడప,ప్రకాశం, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, శ్రీకాకుళం, విశాఖపట్నం ఆరెంజ్ జోన్ లో ఉన్నాయి. విజయనగరం మాత్రం గ్రీన్ జోన్ లో ఉంది…

jojobet girişJojobet GirişJojobet GirişCasibomiptv satın alMadridbetMadridbetMadridbetkatlaCasibom GirişMarsbahis GirişCasibom Giriş