iDreamPost
android-app
ios-app

ఏపీలో 135 మందికి కరోనా నిర్దారణ

ఏపీలో 135 మందికి కరోనా నిర్దారణ

ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసుల ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ లో 135 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్దారణ అయింది. దీంతో రాష్ట్రంలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 4,261 కు చేరిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ  వెల్లడించింది. కాగా  2540 మంది వైరస్ బారి నుండి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కరోనా ఆక్టీవ్ కేసుల సంఖ్య 1641 గా నమోదయింది. కరోనా కారణంగా ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 80 మంది మరణించారు.

గడచిన 24 గంటల్లో 65 మంది కోవిడ్19 నుండి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యం తో డిశ్చార్జ్ చేయబడ్డారని,తూర్పు గోదావరి జిల్లాలో ఒకరు, కృష్ణా జిల్లాలో ఒకరు మృతి చెందారని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 11602  శాంపిల్స్‌ పరీక్షించగా రాష్ట్రంలో 135 పాజిటివ్‌ కేసులు నిర్దారణ అయ్యాయి. కాగా ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వారిలో 38 మందికి కరోనా పాజిటివ్ కాగా విదేశాల నుండి వచ్చిన వారికి 9 మందికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది. దానితో మొత్తం కేసులు 182 మందికి కరోనా సోకినట్లు నిర్దారణ అయ్యింది.

jojobet girişJojobet GirişJojobet GirişCasibomtaraftarium24luxbetluxbetRulobetkatlaJojobet GirişJojobet GirişMarsbahis Giriş