iDreamPost
android-app
ios-app

ఏపీలో తాజాగా 54 మందికి కరోనా నిర్దారణ

ఏపీలో తాజాగా 54 మందికి కరోనా నిర్దారణ

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ లో 54 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్దారణ అయింది. దీంతో రాష్ట్రంలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 1887 కు చేరిందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. కాగా  842 మంది వైరస్ బారి నుండి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కరోనా ఆక్టీవ్ కేసుల సంఖ్య 1004 గా నమోదయింది. గడచిన 24 గంటల్లో కర్నూలులో ఇద్దరు విశాఖలో ఒక్కరు మరణించారు.దీంతో కరోనా కారణంగా ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 41 మంది మరణించారు.

గడిచిన 24 గంటల్లో  7,320 మంది శాంపిల్స్‌ పరీక్షించగా 54 పాజిటివ్‌ కేసులు నిర్దారణ అయ్యాయి. అత్యధికంగా అనంతపురంలో 16, విశాఖపట్నంలో 11 మందికి కరోనా సోకింది. వెస్ట్ గోదావరిలో 9, కర్నూల్ లో 7, గుంటూరులో 1 ,కృష్ణా 6, విజయనగరంలో ఒకరికి కరోనా వైరస్ నిర్దారణ అయింది. దీంతో మొత్తం 54 పాజిటివ్ కేసులు నిర్దారణ అయ్యాయి.

gamdommarsbahis girişMarsbahisjojobetjojobet girişJojobet Giriş