iDreamPost
iDreamPost
తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి నూతన రథ నిర్మాణం తుది దశకు చేరుకుంది . ప్రమాదంలో కాలిపోయిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తును ముమ్మరం చేయడంతో పాటు కొత్త రథాన్ని నిర్మించాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో సెప్టెంబర్ నెలలలో రుత్వికులు నిర్ణయించిన ముహూర్తానికి రాష్ట్ర మంత్రులు ధర్మాన కృష్ణదాస్, చెల్లుబోయిన శ్రీనివాసవేణుగోపాల కృష్ణ, తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కె. మురళీధర్రెడిడ, ఎంపీ చింతా అనురాధ, ఎమ్మెల్యేలు రాపాక వరప్రసాదరావు తదితరులు ప్రత్యేక పూజలు చేసి నిర్మాణ పనులు ప్రారంభించారు .
అయితే ఇప్పుడు ఆ అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి నూతన రథ నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. 42 అడుగుల ఎత్తు,14 అడుగుల వెడల్పు, ఏడు అంతస్తుల రథ నమూనతో 1 కోటి 10 లక్షల వ్యయంతో చేపట్టిన నుతన రథ నిర్మాణం కేవలం మూడూ నెలల కాలంలో శరవేగంగా నిర్మాణం పూర్తి చేసుకుంది, జనవరి నెలాఖరకు రథం తయారీ మొత్తం పూర్తి అవుతుందని అధికారులు చెప్పుకోచ్చారు. మత రాజకీయాలు చేద్దం అని చూసిన రాజకీయ పార్టీలకు ప్రభుత్వం అంతర్వేది రథ నిర్మాణంలో చూపిన చోరవ ఒక చెంపపెట్టుగా చేపొచ్చు.