iDreamPost

వృద్ధాశ్రమంలో ఒంటరి మహిళపై కన్నేసిన పాస్టర్! కోరిక తీర్చాలంటూ..!

వృద్ధాశ్రమంలో ఒంటరి మహిళపై కన్నేసిన పాస్టర్! కోరిక తీర్చాలంటూ..!

ఈ మధ్యకాలంలో కొందరు దారుణాలకు పాల్పడుతున్నారు. బయట అందమైన ఆడపిల్ల కనిపిస్తే చాలు.. ఐలవ్ యూ అని చెప్పడం, కాదంటే అత్యాచారాలు, ఆపై హత్యలకు పూనుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు దేశ వ్యాప్తంగా రోజుకొక చోటు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ ఘటనలు మరువకముందే తాజాగా ఏపీలో ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. ఓ ఒంటరి మహిళపై పాస్టర్ కన్నేసి కోరిక తీర్చాలంటూ వేధింపులకు పాల్పడ్డాడు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

స్థానికుల కథనం ప్రకారం.. కర్నూలు జిల్లాలోని డోన్ లో జానా ప్రభాకర్ అనే పాస్టర్ ఓ వృద్ధాశ్రమాన్ని నడిపస్తున్నాడు. ఈ ఆశ్రమంలో ఎంతో మంది వృద్ధులు, ఒంటరి మహిళలు నివాసం ఉంటున్నారు. అయితే, గత ఐదు నెలల కిందట ఈ ఆశ్రమంలో ఓ ఒంటరి మహిళ నివాసం ఉంటుంది. కొన్నాళ్ల తర్వాత పాస్టర్ ప్రభాకర్ ఆ మహిళపై కన్నేశాడు. కోరిక తీర్చాలంటూ ఆ మహిళపై వేధింపులకు పాల్పడ్డాడు. ఆ మహిళ ఒప్పుకోకపోవడంతో ఆమె ఒంటిపై బట్టలు లేకుండా దాడికి దిగినట్లు కూడా తెలుస్తుంది. ఇక పాస్టర్ దారుణాలను సహించలేకపోయిన ఆ మహిళ.. తాజాగా స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు.. మతం ముసుగులో ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్న ఈ దుర్మార్గుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి