iDreamPost

జార్ఖండ్ లో గెలుపు మాదే: బిజెపి

జార్ఖండ్ లో గెలుపు మాదే: బిజెపి

జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో జేఎంఎం-కాంగ్రెస్‌ కూటమి ఆధిక్యంలో కొనసాగుతుండగా పాలక బిజెపికి గెలుపుపై నమ్మకం సడలలేదు. బీజేపీ నేతృత్వంలోనే జార్ఖండ్‌లో తదుపరి ప్రభుత్వం ఏర్పాటవుతుందని ముఖ్యమంత్రి రఘబర్‌దాస్‌ విశ్వాసం వ్యక్తం చేశారు. ఇంకా చాలా రౌండ్లలో ఓట్ల లెక్కింపు చేపట్టాల్సిన క్రమంలో ఇప్పుడే స్పష్టమైన ప్రకటన చేయలేమని చెప్పుకొచ్చారు. ఆధిక్యాలు చాలా తక్కువగా ఉన్నాయని, వీటి మధ్య దోబూచులాట నెలకొందని, ఇప్పుడు మీరు చూస్తున్న లీడ్స్‌ ఏ క్షణమైనా తారుమారు కావచ్చని ఆయన పేర్కొన్నారు.

తుది ఫలితాలు వెల్లడైన తర్వాత తమకు స్పష్టమైన ఆధిక్యం లభిస్తుందని ధీమా వ్యక్తం చేశారు సీఎం మాట్లాడిన సమయంలో మొత్తం 81 స్ధానాలకు గాను బీజేపీ 30 స్ధానాల్లో ముందంజలో ఉండగా, జేఎంఎం-కాంగ్రెస్‌ కూటమి 39 స్ధానాల్లో ముందంజలో ఉంది. విపక్ష కూటమి విజయ పధంలో నడుస్తున్న నేపథ్యంలో జేఎంఎం చీఫ్‌ హేమంత్‌ సొరేన్‌ జార్ఖండ్‌ సీఎం పగ్గాలు చేపడతారని కూటమి నేతలు స్పష్టం చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి