iDreamPost

టీడీపీ ఆఫీస్‌లో ఆసక్తికర సీన్.. జై జగన్ అంటూ నినాదాలు!

టీడీపీ ఆఫీస్‌లో ఆసక్తికర సీన్.. జై జగన్ అంటూ నినాదాలు!

రాజకీయాల్లో అనేక ఆసక్తికర ఘటనలు చోటుచేసుకోవడం మనం చూస్తునే ఉంటాము. ముఖ్యంగా ఒక పార్టీ నాయకుడు మరో వారిని పొగడటం, ఆ పార్టీ నాయకుడికి జేజేలు కొట్టడం వంటి ఘటనలు జరుగుతుంటాయి. అన్ని రాష్ట్రాల్లో  ఇలాంటివి జరుగుతున్నప్పటికి ఏపీలో మాత్రం చాలా హైలెట్ గా నిలుస్తున్నాయి. గతంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు.. తమ పార్టీపై నెగిటీవ్ కామెంట్స్ చేసినట్లు కొన్ని వీడియోలు బయటకు వచ్చాయి. ఇప్పుడు చిత్తూరు జిల్లాకు చెందిన ఆ పార్టీ నేత ఒకరు.. ఏకంగా టీడీపీ ఆఫీస్ లోనే   జై జగన్ అంటూ నినాదలు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

రాష్ట్ర స్థాయిలో  టీడీపీ మధ్య వర్గ విభేదాలు ఉన్నట్లు కొందరు  అభిప్రాయ పడుతున్నారు. కారణం తరచూ పలు జిల్లాలో ఈ నేతల మధ్య జరుగుతున్న మాటల యుద్ధమే కారణం. విమర్శకుల మాటలకు బలం చేకూరుస్తూ చిత్తూరు జిల్లా మదనపల్లె టీడీపీ ఆఫీస్ లో ఓ ఆసక్తికరమైన సీన్ జరిగింది.  మదనపల్లె టీడీపీ ఆఫీ కార్యాలయంలో చంద్రబాబును బూతులు తిడుతూ  టీడీపీ నేత విద్యాసాగర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.  చంద్రబాబు వైఖరిపై విమర్శలు కురిపించారు. అంతేకాక  జై జగన్ అంటూ పార్టీ కార్యాలయంలోనే నినాదాలు చేశారు. ఇలా టీడీపీ నేత ఆగ్రహం వ్యక్తం చేసిన వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది.

ఇక ఆ వీడియోలో.. టీడీపీ  అధినేతపై విద్యాసాగర్ వ్యగ్యాంస్త్రాలు సంధించారు. బాబుకు వయసైపోయాక వేపకాయంత వెర్రి వచ్చిందని మాట్లాడారు. బస్టాండ్ లో టీడీపీ జెండాను తగుల బెడతాన్ని  అన్నారు.  జగన్ తమకేమీ ద్రోహం చేయలేదని, జై జగన్ అంటూ నినాదాలు చేశారు.  ఈ ఘటన కొన్ని రోజుల క్రితం జరగ్గా తాజాగా వెలుగులోకి వచ్చింది. అలానే ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మరి..  ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: బ్రో నిర్మాతలకు నిల్లు.. ప్యాకేజీ స్టార్ పాకెట్ ఫుల్లు! మంత్రి అంబటి ట్వీట్!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి