iDreamPost

రష్మీక ఇంటి పై ఐటి దాడులు

రష్మీక ఇంటి పై ఐటి దాడులు

ఇటీవల వరుస హిట్లతో మాంచి ఫామ్ లో ఉన్న కన్నడ నటి రష్మీక ఇంటి మీద ఆదాయపు పన్ను అధికారులు దాడులు చేశారు. తాజాగా మహేష్ బాబుతో ఆమె కలిసి నటించిన సరిలేరు నీకెవ్వరు జనాదరణ పొందుతోంది. ఇదిలా ఉండగా ఆమె కర్ణాటక లోని కొడగు జిల్లాలో విరాజ్ పేటలో తల్లిదండ్రులతో ఉండగా గురువారం ఆమె ఇంటి మీద మూడు కార్లతో బెంగళూరు నుంచి వచ్చిన ఆదాయపు పన్ను అధికారులు దాడి చేసి ఆమె కట్టిన పన్నుల వివరాలు, ఆదాయం తదితర వివరాలు ఆరాతీశారు. ఆమె తండ్రి కొన్ని వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. ఈ వివరాలనూ అధికారులు అడిగి తెలుసుకున్నారు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి