Nidhan
కేప్టౌన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్లో ఆతిథ్య సౌతాఫ్రికా 55 పరుగులకే ఆలౌట్ అయింది. అయితే ఓ విషయంలో మాత్రం భారత్ కంటే ప్రొటీస్ బెస్ట్గా నిలిచింది.
కేప్టౌన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్లో ఆతిథ్య సౌతాఫ్రికా 55 పరుగులకే ఆలౌట్ అయింది. అయితే ఓ విషయంలో మాత్రం భారత్ కంటే ప్రొటీస్ బెస్ట్గా నిలిచింది.
Nidhan
సౌతాఫ్రికా-టీమిండియా మధ్య జరుగుతున్న సెకండ్ టెస్ట్ ఆసక్తికరంగా సాగుతోంది. సెషన్, సెషన్కు ఆధిపత్యం మారుతోంది. ఒక సెషన్లో ఓ జట్టు డామినేషన్ నడిస్తే.. మరో సెషన్ ఇంకో టీమ్ ఆధిపత్యం చెలాయిస్తోంది. దీంతో అసలైన టెస్ట్ క్రికెట్ మజాను ఆడియెన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. కేప్టౌన్లో జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్కు దిగిన సౌతాఫ్రికా ఫస్ట్ ఇన్నింగ్స్లో 23.2 ఓవర్లలో 55 పరుగులకే ఆలౌట్ అయింది. పిచ్ నుంచి లభించిన పేస్, స్వింగ్ను ఉపయోగించుకున్న భారత బౌలర్లు ఆతిథ్య జట్టును అరవై పరుగుల్లోపే కుప్పకూల్చారు. అయితే ఈ ఆనందం ఎక్కువ సేపు నిలువలేదు. ప్రొటీస్ పేసర్లకు కూడా పిచ్ నుంచి మద్దతు లభించింది. దీంతో వాళ్లు భారత్ను 153 రన్స్కు ఆలౌట్ చేశారు. ఈ నేపథ్యంలో ఓ విషయంలో టీమిండియా కంటే సౌతాఫ్రికానే బెస్ట్గా నిలిచింది.
భారత ఇన్నింగ్స్లో ఏకంగా ఏడుగురు బ్యాటర్లు డకౌట్గా వెనుదిరిగారు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ గోల్డెన్ డక్గా పెవిలియన్కు చేరుకున్నాడు. మరో ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ (39), యంగ్ బ్యాటర్ శుబ్మన్ గిల్ (36) మంచి పార్ట్నర్షిప్ నెలకొల్పారు. అయితే వీళ్ల భాగస్వామ్యాన్ని బర్గర్ విడదీశాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (46) ఆఖరి వరకు ఒంటరి పోరాటం చేశాడు. శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ముకేష్ కుమార్ గోల్డెన్ డక్లుగా వెనుదిరిగారు. ఒక దశలో 153/4తో పటిష్టంగా కనిపించిన రోహిత్ సేన.. అదే స్కోరుకు మిగిలిన ఆరు వికెట్లను కోల్పోయింది. ఒంటరి పోరాటం చేసిన కోహ్లీ చివరి వికెట్గా వెనుదిరిగాడు. 55 రన్స్కు ఆలౌట్ అయి పరువు పోగొట్టుకున్న సౌతాఫ్రికా డకౌట్ల విషయంలో భారత్ కంటే బెస్ట్గా నిలిచింది. సఫారీ ఫస్ట్ ఇన్నింగ్స్లో మార్కో యాన్సన్ ఒక్కడే డకౌట్ అయ్యాడు.
టీమిండియా ఇన్నింగ్స్లో మాత్రం ఏకంగా ఏడుగురు బ్యాటర్లు ఖాతా తెరవకుండానే పెవిలియన్కు చేరుకున్నారు. రోహిత్, గిల్, కోహ్లీతో పాటు మరే ఇద్దరు రాణించినా భారత్ మంచి లీడ్ సాధించేది. సింగిల్ రన్ కూడా చేయకుండా ఒక జట్టు చివరి 6 వికెట్లు కోల్పోవడం టెస్ట్ క్రికెట్ హిస్టరీలో ఇదే ఫస్ట్ టైమ్. ఇక, రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌతాఫ్రికా ప్రస్తుతం 12.1 ఓవర్లకు 2 వికెట్ల నష్టానికి 41 పరుగులతో ఉంది. ఎయిడెన్ మార్క్రమ్ (25 నాటౌట్), ట్రిస్టాన్ స్టబ్స్ (0 నాటౌట్) క్రీజులో ఉన్నారు. ప్రొటీస్ కెప్టెన్ డీన్ ఎల్గర్ (12)ను యంగ్ పేసర్ ముకేష్ కుమార్ ఔట్ చేశాడు. టోనీ జార్జి (1)ని కూడా అతడే పెవిలియన్కు పంపాడు. భారత్ స్కోరుకు సౌతాఫ్రికా ఇంకా 57 పరుగుల దూరంలో ఉంది. సిచ్యువేషన్ చూస్తుంటే రెండ్రోజుల్లో ఈ టెస్ట్ ముగిసేలా ఉంది. మరి.. డకౌట్స్ విషయంలో భారత్ కంటే సౌతాఫ్రికా బెస్ట్గా నిలవడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: BCCIపై లలిత్ మోడీ ఫైర్.. అది వెర్రితనమంటూ..!
First time in Test cricket history:
Team lost the last 6 wickets without scoring a single run…!!! pic.twitter.com/hNt1dJ4aVt
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 3, 2024