Nidhan
కేప్టౌన్ టెస్ట్లో టీమిండియా అదరగొట్టింది. 7 వికెట్ల తేడాతో నెగ్గి సఫారీలపై ప్రతీకారం తీర్చుకుంది. ఈ మ్యాచ్లో భారత్ ఘనవిజయానికి గల కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
కేప్టౌన్ టెస్ట్లో టీమిండియా అదరగొట్టింది. 7 వికెట్ల తేడాతో నెగ్గి సఫారీలపై ప్రతీకారం తీర్చుకుంది. ఈ మ్యాచ్లో భారత్ ఘనవిజయానికి గల కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
Nidhan
తొలి టెస్ట్లో తమను చావుదెబ్బ తీసిన సౌతాఫ్రికా మీద టీమిండియా ప్రతీకారం తీర్చుకుంది. తనదైన స్టైల్లో ప్రత్యర్థి జట్టును చిత్తు చేసింది. ఈ రెండు టీమ్స్ మధ్య జరిగిన రెండో టెస్ట్లో రోహిత్ సేన 7 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. తొలి రోజు 23 వికెట్లు నేలకూలిన కేప్టౌన్ పిచ్ మీద రెండో రోజు 10 వికెట్లు పడ్డాయి. డే-1 మొదటి సెషన్ నుంచి డామినేషన్ కనబరుస్తూ వచ్చిన టీమిండియానే ఆఖరికి విజయం వరించింది. రెండో రోజు బ్యాటింగ్ కంటిన్యూ చేసిన ప్రొటీస్ టీమ్ 176 పరుగులకు ఆలౌట్ అయింది. స్వల్ప టార్గెట్ను ఛేజించేందుకు బరిలోకి దిగిన భారత్ 12 ఓవర్లలో 3 వికెట్లకు 80 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. 107 ఓవర్లలోనే ఈ మ్యాచ్ ముగిసిపోవడం ఓ హైలైట్. టెస్ట్ క్రికెట్ హిస్టరీలో షార్టెస్ట్ మ్యాచ్గా రికార్డు సృష్టించింది. ఈ నేపథ్యంలో టీమిండియా ఘన విజయానికి గల 5 కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
రెండో టెస్ట్లో భారత్ విజయంలో ప్రధాన కారణంగా బౌలింగ్ను చెప్పుకోవాలి. పేస్, బౌన్స్కు అనుకూలిస్తున్న పిచ్ మీద పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఈ మ్యాచ్లో వీళ్లిద్దరూ కలసి ఏకంగా 15 వికెట్లు తీశారు. వీళ్లకు తోడు యంగ్ పేసర్స్ ముకేష్ కుమార్, ప్రసిద్ధ్ కృష్ణ కూడా రాణించారు. ముఖ్యంగా ముకేష్ తనకు బాల్ ఇచ్చిన ప్రతిసారి బ్రేక్ త్రూలతో కెప్టెన్ రోహిత్ శర్మ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. భారత పేస్ బౌలర్లు ఓ యూనిట్లా కలసికట్టుగా ఆడుతూ టీమ్కు విజయాన్ని అందించారు. ఈ మ్యాచ్లో టీమిండియా విజయానికి మరో కారణం విరాట్ కోహ్లీ. బౌన్సీ వికెట్ మీద సౌతాఫ్రికా పేసర్లను కాచుకొని ఫస్ట్ ఇన్నింగ్స్లో 46 పరుగులు చేశాడు కోహ్లీ. ఆఖరి వరకు నిలబడి అతడు చేసిన ఒంటరి పోరాటం వల్లే టీమ్ 153 పరుగులు చేయగలిగింది.
బ్యాటింగ్లో రన్స్ చేయడమే గాక ఫీల్డింగ్ టైమ్లో కూడా కెప్టెన్ రోహిత్తో పాటు బౌలర్లకు విలువైన సూచనలు ఇస్తూ గెలుపులో కీలక పాత్ర పోషించాడు కోహ్లీ. ఈ మ్యాచ్లో భారత్ విజయానికి మరో కారణం సిరాజ్-బుమ్రా స్పెల్. బౌలర్లు అందరూ కలసికట్టుగా రాణించినా ఫస్ట్ ఇన్నింగ్స్లో సిరాజ్ (6/15), సెకండ్ ఇన్నింగ్స్లో బుమ్రా (6/61) వేసిన స్పెల్స్ కారణంగా సౌతాఫ్రికా టీమ్ తక్కువ రన్స్కే కుప్పకూలింది. పేస్, బౌన్స్ను చక్కగా వినియోగించుకుంటూ సఫారీలను సొంత గడ్డపై 55 పరుగుల్లోపే చాప చుట్టేసేలా చేశాడు సిరాజ్. రెండో ఇన్నింగ్స్లో ఆ టీమ్ లీడ్ను 100 పరుగులు దాటకుండా సూపర్బ్ డెలివరీస్తో కట్టిపడేశాడు బుమ్రా. సో, వీళ్లకు అందరికంటే ఎక్కువ క్రెడిట్ ఇవ్వాల్సిందే.
ఈ మ్యాచ్లో భారత్ గెలుపునకు మరో కారణం రోహిత్-జైస్వాల్ పార్ట్నర్షిప్. టార్గెట్ 79 పరుగులే కానీ వికెట్ పేస్, స్వింగ్కు సహకరిస్తోంది. ఎదురుగా రబాడ, జాన్సన్, బర్గర్, ఎంగిడి లాంటి వరల్డ్ క్లాస్ బౌలర్లు ఉన్నారు. మంచి స్టార్ట్ దొరకకపోతే టీమ్ కష్టాల్లో పడుతుంది. ఈ తరుణంలో బ్యాటింగ్కు దిగిన ఓపెనర్లు రోహిత్ (17 నాటౌట్), జైస్వాల్ (28) కలసి ఫస్ట్ వికెట్కు 44 పరుగుల భాగస్వామ్యం జోడించారు. ఆరంభంలోనే వికెట్లు తీసి టీమిండియాపై ప్రెజర్ పెడదామని అనుకున్న సౌతాఫ్రికా ప్లాన్స్ వీళ్లిద్దరి ముందు వర్కౌట్ కాలేదు. ఆ తర్వాత జైస్వాల్ ఔటైనా మిగిలిన లాంఛనాన్ని హిట్మ్యాన్ కంప్లీట్ చేశాడు. ఈ మ్యాచ్లో రోహిత్ కెప్టెన్గానూ టైమ్కు తగ్గట్లు డెసిజన్స్ తీసుకొని, మంచి స్ట్రాటజీతో ప్రత్యర్థి బ్యాటర్ల పనిపడుతూ, కండీషన్స్కు తగ్గట్లుగా బౌలింగ్ ఛేంజెస్ చేస్తూ ఆకట్టుకున్నాడు. అతడి లీడర్షిప్ కూడా భారత్ విజయానికి మరో కారణంగా చెప్పొచ్చు. మరి.. రెండో టెస్ట్లో టీమిండియా విక్టరీకి ఇంకేమైనా కారణాలు ఉన్నాయని మీరు భావిస్తే కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: IND vs SA: చరిత్ర సృష్టించిన భారత్.. టెస్ట్ క్రికెట్ హిస్టరీలో ఇదే ఫస్ట్ టైమ్!
The shortest ever Test match in history.
– Wraps up in 5 sessions..!!!pic.twitter.com/s0a5kZ0ETU
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 4, 2024