idream media
idream media
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నిన్న రాత్రి అస్వస్థత గురవ్వడంతో అయనను హుటాహుటిన AIIMSలో చేర్చారు , ఆదివారం సాయంత్రం 8.45కు ఆయన జ్వరంతో పాటు ఛాతిలో నొప్పి గా ఉందని కుటుంబ సభ్యులకి చెప్పడంతో, వెంటనే అయనను ఢిల్లీ లోని AIIMS కి తరలించి హాస్పటల్ లో కార్డియో ధొరాసక్ వార్డులో ఉంచి ఆయనకు వైద్య సేవలు అందిస్తున్నారు.
87 ఏళ్ల వయస్సులో కుడా ఎంతో ఉత్సాహంతో పార్టీ కార్యక్రమాలో ఇటీవల పాల్గొన్న మన్మోహన్ సింగ్ హఠాత్తుగా అస్వస్థతకు గురి కావడంతో కుటుంబ సభ్యులతో పాటు ఆయన స్నేహితులు, కాంగ్రెస్ పెద్దలు ఆందోళకు గురయ్యారు. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ అన్ని రాజకీయ పక్షాల నేతలు ట్విట్టర్లో తమా సందేశాని పోస్ట్ చేశారు. 2009లో ఆయనకు AIIMSలో బైపాస్ జరిగిన విషయం తెలిసిందే.