iDreamPost

తిరుమల ప్రయాణికులకు శుభవార్త.. రోజుకి వెయ్యిమందికి దర్శన టికెట్లు

తిరుమల ప్రయాణికులకు శుభవార్త.. రోజుకి వెయ్యిమందికి దర్శన టికెట్లు

తెలంగాణ నుంచి తిరుమలకు వెళ్లే ప్రయాణికులకు టిఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. తెలంగాణ నుుంచి రోజుకు వెయ్యి మందికి రూ. 300 దర్శన టికెట్లను జారీచేయనున్నట్లు ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్, మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ తెలిపారు. 1000 మంది ప్రయాణికులకు శ్రీవారి దర్శన టికెట్లను అందించేందుకు టిటిడి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అంగీకరించారన్నారు. ఈ దర్శన టికెట్లు పొందాలనుకునే ప్రయాణికులు.. తమ ప్రయాణానికి రెండ్రోజులు ముందు తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో టికెట్టు రిజర్వు చేసుకోవాల్సి ఉంటుందన్నారు.

కాగా.. వేసవి సెలవులు, రెండేళ్ల తర్వాత ఈ ఏడాదే శ్రీవారి దర్శనానికి భక్తులను పూర్తిస్థాయిలో అనుమతించడంతో.. తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నాయి. సాధారణ రోజుల్లో కంటే.. వేసవి సెలవుల్లో భక్తుల రద్దీ కాస్త ఎక్కువగానే ఉంటుంది. కానీ ఈ ఏడాది ఆ రద్దీ మరింత పెరిగింది. మండుటెండల్లో శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్తున్న భక్తులు నానా ఇబ్బందులు పడుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి