iDreamPost

ఒంటి నిండా బంగారం.. తిరుమలలో గోల్డ్‌ మ్యాన్‌ సందడి!

ఒంటి నిండా బంగారం.. తిరుమలలో గోల్డ్‌ మ్యాన్‌ సందడి!

తిరుమలలో గోల్డ్‌ మ్యాన్‌ సందడి చేశాడు. ఒంటినిండా బంగారంతో భక్తులను ప్రత్యేకంగా ఆకర్షించారు. దీంతో గోల్డ్‌ మ్యాన్‌తో ఫొటోలు, సెల్ఫీలు దిగటానికి జనం పోటీ పడ్డారు. ఆ వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రకు చెందిన సుభాష్‌ చంద్ర తన కుటుంబంతో కలిసి తాజాగా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వచ్చారు. అది కూడా ఒంటి నిండా బంగారంతో ఆయన క్యూలైన్‌లో నిలబడ్డంతో భక్తులంతా ఎంతో ఆశ్చర్యంగా ఆయన్నే చూడ్డం మొదలుపెట్టారు.

దర్శనం అనంతరం ఆయన బయటకు వచ్చిన తర్వాత కూడా భక్తులు ఆయన్ని చూడ్డానికి ఎగబడ్డారు. గోల్డ్‌ మ్యాన్‌తో ఫొటోలు, సెల్ఫీలు దిగటానికి పోటీ పడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ తిరుమల శ్రీవారు మా ఇంటి ఇలవేల్పు. అందుకే స్వామి, అమ్మవార్ల ప్రతిమలతో కూడిన బంగారు ఆభరణాలు ధరించి ప్రతీ ఏటా తిరుమల దర్శనానికి వస్తాము. అది మా ఆనవాయితీ. ఈ బంగారు నగలను మా పూర్వీకులు తయారు చేయించారు’’ అని చెప్పొకొచ్చాడు.

ఇక, తిరుమలలో గోల్డ్‌ మ్యాన్‌కు సంబంధించిన వార్తలు సోషల్‌ మీడియాలో.. మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక, నెటిజన్లు తమదైన శైలిలో గోల్డ్‌ మ్యాన్‌ గురించి స్పందిస్తూ ఉన్నారు.  కాగా, తిరుమలలో రద్దీ కొనసాగుతోంది. గురువారం శ్రీవారి దర్శనానికి 57,443 మంది భక్తులు వచ్చారు. స్వామి హుండీ ఆదాయం 3.9 కోట్ల రూపాయలు వచ్చినట్లు టీటీడీ తెలిపింది. మరి, తిరుమలలో మహారాష్ట్రకు చెందిన గోల్డ్‌ మ్యాన్‌ సుభాష్‌ చంద్ర తిరుమలలో సందడి చేయటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి