iDreamPost

ముఖ్యమంత్రి చేతికి రాజధాని కమిటీ రిపోర్ట్

ముఖ్యమంత్రి చేతికి రాజధాని కమిటీ రిపోర్ట్

రాష్ట్ర సమగ్రాభివృద్ధికి పాటుగా రాజధాని అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన GN రావు కమిటీ తుది నివేదికను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి అందజేసింది. నివేదిక లోని అంశాలను ముఖ్యమంత్రికి వివరించింది. సెప్టెంబర్‌ 13న ఈ కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు తాము సందర్శించిన ప్రాంతాలు, అధ్యయనం చేసిన అంశాలను కమిటీ సభ్యులు నివేదిక ద్వారా ముఖ్యమంత్రికి వివరించారు. కాగా ఈ నెల 27న రాష్ట్ర కేబినెట్‌ భేటీ జరగనుంది. ఈ కేబినెట్ భేటీలో GN రావు కమిటీ నివేదికపై చర్చ జరగనున్నట్లు సమాచారం.కేబినెట్ మీటింగ్ అనంతరం జనవరి మొదటివారంలో అఖిలపక్ష సమావేశం జరగనుంది.కమిటీ నివేదికను అఖిల పక్షానికి జగన్ సర్కార్ వివరించనుంది.

ఈ సమావేశం తర్వాతే రాజధాని విషయంలో సస్పెన్స్ వీడే అవకాశాలు ఉన్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి